జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని రేగొండ మండల కేంద్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 40 మంది లబ్ధిదారులకు 15 లక్షల 50 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి వరంగా మారిందన్నారు.
వైద్యం చేయించుకోలేని పేదలకు సీఎంఆర్ఎఫ్ ఎంతో ఆసరగా నిలుస్తుందన్నారు. సీఎం కేసీఆర్ నిరుపేదల పక్షపాతి అన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.