జయశంకర్ భూపాలపల్లి : పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు కొండంత అండ అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. శుక్రవారం 54 లక్షల రూపాయల విలువ గల చెక్కులను ఎమ్మెల్యే క్కాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని తెలిపారు. ఈ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ ప్రెసిడెంట్ నర్సింగరావు, PACS చైర్మన్ పూర్ణచందర్ రెడ్డి, ఎంపీటీసీ లు సుధర్మ మల్హాల్ రావు, శివశంకర్, మధుకర్, తదితరులు పాల్గొన్నారు.