భూపాలపల్లి : రాష్ట్రంలో పేదింటి ఆడపడుచులకు సీఎం కేసీఆర్ పెద్ద దిక్కుగా మారారని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. గురువారం భూపాలపల్లి మండలంలోని కొంపెల్లి, గొర్లవీడు, నేరేడుపల్లి, కొత్తపల్లి (ఎస్ఎం) గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఎమ్మెల్యే రమణారెడ్డి నేరుగా లబ్దిదారుల ఇండ్ల వద్దకే వెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. వారితో మాట్లాడి యోగక్షేమాలు అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డలను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తూ కుటుంబ పెద్దగా, తండ్రిలా, మేనమామలా మారాడని అన్నారు.
గతంలో క్యాంపు కార్యాలయంలో చెక్కులను అందజేశామని, ప్రస్తుతం పనుల సీజన్ కావడంతో వారి పనులకు ఇబ్బంది కలిగించకూడదని, తామే వారి ఇండ్ల వద్దకు వెళ్లి చెక్కులను అందజేశామని తెలిపారు. కరోనా తో ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను మాత్రం ఆపకుండా కొనసాగించిందని అన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు దరఖాస్తు చేసుకునే వారు ఎవరికీ డబ్బులు ఇవ్వవద్దని, దరఖాస్తు చేసుకున్న నాలుగు నెలల్లోపే ప్రభుత్వం చెక్కులు మంజూరు చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మందల లావణ్య, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్ యాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు పిన్రెడ్డి రాజిరెడ్డి, మాజీ మండల అధ్యక్షులు మందల రవిందర్రెడ్డి, అర్భన్ మాజీ అధ్యక్షులు క్యాతరాజు సాంబమూర్తి, మాజీ పీఏసీఎస్ చైర్మన్ మందల విద్యాసాగర్రెడ్డి, సర్పంచ్లు కాసగాని కవిత దేవెందర్, తాటికంటి శంకరయ్య, తాళ్లపల్లి స్వామి, దానవేన రమ, ఎంపీటీసీలు పాతూరి సంధ్య, అప్పం రజిత, తరాల నర్సింగం, ఉప సర్పంచ్ మైనొద్ధీన్ ,నేతలు పింగిళి రవిందర్రెడ్డి, పినగాని నర్సయ్య, చిందం కిరణ్ తదితరులు పాల్గొన్నారు.