నాగులమ్మ, పగిడిద్దరాజుకు భక్తుల మొక్కులు
మంగపేట, ఏప్రిల్ 2 : మండలంలోని లక్ష్మీనర్సాపురంలో నాగులమ్మ – పగిడిద్దరాజు కల్యాణం గురువారం రాత్రి కనులపండువగా జరిగింది. ఐదు రోజులుగా కొనసాగుతున్న జాతరలో ముఖ్యఘట్టమైన నాగులమ్మ ఆగమనం తర్వాత ఉపాసకుడు రామకృష్ణస్వామి, ప్రధాన పూజారి నాగరమేశ్ ఆధ్వర్యంలో కల్యాణ తంతు జరిపించారు. అనంతరం ఆయా ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు నాగులమ్మ, సడాలమ్మకు మొక్కులు చెల్లించుకోగా, పూజారులు, వడ్డెలు వారికి అమ్మవార్ల బండారిని అందజేశా రు. నేడు దేవతల వనప్రవేశంతో జాతర ముగియనున్నది. కల్యాణం నేప థ్యంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు. ఈ వేడుకల్లో పూజారులు, వడ్డెలు కొమురం ధనలక్ష్మి, గాయత్రి, బాడిశ నవీన్, నాగలక్ష్మి, సోడి శ్రీను, మడకం రమేశ్, మడకం లక్ష్మయ్య, సత్యం, కులపెద్దలు పాల్గొన్నారు.
ఇవి కూడా చూడండి..
ఢిల్లీలో లాక్డౌన్ విధించే యోచన లేదు: సీఎం కేజ్రీవాల్
ఇండియా వరల్డ్ రికార్డు.. 24 గంటల్లోనే రోడ్డు నిర్మాణం: గడ్కరీ