పుట్ట లింగమ్మ ట్రస్టు ఆధ్వర్యంలో ఆక్సిజన్ అంబులెన్స్ సేవలు
ప్రారంభించిన జడ్పీ చైర్మన్లు పుట్ట మధు, జక్కు శ్రీహర్షిణి
కాటారం, మే 18 : పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో కేటీఆర్ కొవిడ్ హెల్ప్లైన్ సెంటర్ పేరుతో కరోనా బాధితుల కోసం ఆక్సిజన్ సహిత అంబులెన్స్ను అందుబాటులోకి తీసుకువచ్చా రు. మంగళవారం పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ భూపాలపల్లి జిల్లా చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. కరోనా సోకి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని వరంగల్, ఇతర నగరాల్లోని దవాఖానలకు వైద్యం కోసం తరలించేందుకు ఈ అంబులెన్స్ దోహద పడుతుందన్నారు. కాటారం సబ్ డివిజన్ పరిధిలో ని ఐదు మండలాలకు అంబులెన్సు అం దుబాటులో ఉంటుందని, కరోనా సోకిన వారు సద్వినియోగం చేసుకోవాలని కో రారు. మారుమూల గ్రామాల నుంచి కరోనా బాధితులను వరంగల్, హైదరాబాద్ దవాఖానలకు తరలించే సమయం లో ఆక్సిజన్ అందక మార్గమధ్యంలోనే ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయని, ఇకపై అలాంటి ఘటనలు పునరావృతం గాకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేశామ ని తెలిపారు. అనంతరం మండలంలోని కొత్తపల్లికి చెందిన సడవలికి రూ.15వే లు, శంకరాంపల్లికి చెందిన రాజబాబుకు రూ.50వేలు, బూడిదపల్లికి చెందిన తిరుపతికి రూ.18వేలు, ధన్వాడకు చెందిన స్వర్ణలతకు రూ.12వేల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. టీఆర్ఎస్ జిల్లా నాయకుడు జక్కు రాకేశ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అంకారి భ వాని, ఎంపీపీ రాణీబాయి, ఎంపీటీసీలు తోట జనార్దన్, బండం రాజమణి, బాసా ని రవి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు డోలి అర్జయ్య, మహిళా అధ్యక్షురాలు రత్న సౌ జన్య, నాయకులు భూపెల్లి రాజు, దబ్బె ట రాజేశ్, జోడు శ్రీనివాస్, సడవలి, వంశీ, శ్రీలక్ష్మి, సంతోష్ పాల్గొన్నారు.