ములుగు : భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా చేపడుతున్న జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని ‘క్యాచ్ ద రైన్, వేర్ ఇట్ ఫాల్స్, వెన్ ఇట్ ఫాల్స్’ను పకడ్బందీగా నిర్వహించాలని జల శక్తి అభియాన్ కేంద్ర సభ్యుడు సంజయ్ కుమార్ పేర్కొన్నారు.
శుక్రవారం ములుగు కలెక్టరేట్లో జలశక్తి అభియాన్ గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్లు ఎస్.కృష్ణ అదిత్య, భవేష్ మిశ్రా, ఐటీడీఏ పీఓ అంకిత్, రెండు జిల్లాల అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
కార్యక్రమంలో డీఎఫ్ఓ లావణ్య, భూపాలపల్లి అదనపు కలెక్టర్ దివాకర్, డీఆర్వో కే రమాదేవి, సీఈవోలు, తదితరులు పాల్గొన్నారు.