కాళేశ్వరం/మహదేవపూర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి (Godavari) నదీ ప్రవాహం పెరుగుతోంది. స్థానికంగా, ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో కాళేశ్వరం (Kaleshwaram) పుష్కర ఘాట్ వద్ద 1.8 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది. సాయంత్రానికి 3.3లక్షల క్యూసెక్కులుగా వస్తూ 7.43 మీటర్ల ఎత్తులో నీరు ప్రవహిస్తూ లక్ష్మీ బరాజ్ వైపునకు వెళ్తున్నాయి.
అంబట్పల్లి గ్రామంలో ఉన్న లక్ష్మీ బరాజ్ (Laxmi Barrage) కు వరద పోటెత్తుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి , మహారాష్ట్రలోని ప్రాణహిత నదుల ద్వారా మంగళవారం బరాజ్కు 2,24,340 క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. అన్ని గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు భారీ నీటిపారుదల శాఖ డీఈఈ సురేశ్ తెలిపారు. బరాజ్ ప్రస్తుత నీటిమట్టం 3.90 మీటర్లుగా ఉందని ఆయన పేర్కొన్నారు.