జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో ఉన్న కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్లో మరోసారి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..జెన్కో స్టేజ్-2 లో యాష్ హ్యాండిలింగ్ సిస్టంలోని బాటమ్ యాష్ ఓవర్ ఫ్లో పంపు మోటర్ నుంచి మంటలు చెలరేగాయి.
హై టెంపరేచర్ కారణంగా ఈ ప్రమాదం జరుగగా ఇందులో అధికారుల నిర్లక్ష్యం కూడా ఉన్నట్లు సమాచారం. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. కాగా, కొద్ది రోజుల క్రితం జెన్కోలో ఫైర్ యాక్సిండెంట్ కాగా.. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ ప్రమాద చాయలు తొలగకముందే మరోసారి అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు.