జయశంకర్ భూపాలపల్లి : ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంతో రెండు ఇండ్లు దగ్ధమైన ఘటన మహదేవాపూర్ మండలం పలుగుల గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..
గ్రామంలోని మేకల బాపు అనే వ్యక్తి కూలి పనులకు వెళ్లగా.. ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలింది.
దీంతో ఇంట్లో ఉన్న మొత్తం సామగ్రి, పక్కన ఉన్న మేకల పోషక్క ఇల్లు అందులో ఉన్న సామగ్రి కూడా పూర్తిగా కాలిపోయాయి. స్థానికులు గుర్తించి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా అప్పటికే జరుగాల్సిన నష్టం జరిగిపోయింది. సుమారు రూ.20 లక్షల వరకు ఆస్థి నష్టం అయ్యిందని బాధితులు తెలిపారు.