కృష్ణకాలనీ : భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని అందరూ తప్పకుండా కరోనా వ్యాక్సిన్ వేసుకునేలా వైద్య సిబ్బంది ప్రజలను ప్రోత్సాహించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కారల్ మార్క్స్ కాలనీలో గల ప్రాథమి ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పీహెచ్సీలోని సిబ్బంది, ఓపి, మెడిసిన్స్కు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్ వివరాలను పిహెచ్సీ వైద్యులు డాక్టర్ రవికుమార్ నాయక్ను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో 90శాతం వ్యాక్సినేషన్ పూర్తయిందని, వీలైనంత త్వరగా 100 శాతం పూర్తియ్యేలా చేస్తామన్నారు. భూపాలపల్లి పీహెచ్సీ పరిధిలోని వైద్యులు ఏఎన్ఎంలు, ఆశలు, సూపర్ వైజర్లు, ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేసుకునేలా ప్స్రోహించాలని, కరోనా వ్యాక్సిన్ వేసుకునేందుకు ప్రజలు భయపడొద్దని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ఓ రాజయ్య, ఏఎన్ఎంలు, సూపర్ వైజర్లు పాల్గొన్నారు.