జయశంకర్ భూపాలపల్లి : 2022 ఏప్రిలో జరగనున్న ప్రాణహిత పుష్కరాలపై అన్ని శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా కాళేశ్వరం ఆలయం ఆవరణలోని వేములవాడ గెస్ట్ హౌస్లో సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ఆలయంలో కలెక్టర్ పూజలు చేశారు. గోదావరి తీరంలో ఉన్న జనరల్ పుష్కర ఘాట్, వీఐపీ పుష్కర ఘాట్లను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు.