భూపాలపల్లి: పట్టణ, పల్లె ప్రగతికి సీఎం కేసీఆర్ సర్కారు పెద్దపీట వేస్తుందని భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్దు అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో రూ.15 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు, సైడ్ కాల్వ నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం మున్సిపాలిటీలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి, మౌళిక వసతుల కల్పనకు కృషిచేయడమే కాకుండా వివిధ అభివృద్ధి పనులను చేపట్టిందన్నారు. పట్టణ, పల్లెల ప్రగతితో పరిసరాల పరిశుభ్రత, మౌళిక వసతుల కల్పన జరిగి ప్రజలు వ్యాధుల బారినపడకుండా ఉంటున్నారన్నారు.
గతంలో ఎక్కడ చూసినా చెత్త, చెదారం పెరుకుపోయి, దోమలు వ్యాప్తి చెంది ప్రజలు వ్యాధుల బారిన పడేవారన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చొరవతో భూపాలపల్లి మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్దు అన్నారు. ఆమె వెంట 18వ వార్డు కౌన్సిలర్ నాగుల శిరీష దేవేందర్ రెడ్డి, ఆయా విభాగాల మున్సిపల్ అధికారులు, సిబ్బంది, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కట్ట బ్రహ్మనందం, సర్వేశం, తిరుపతి, ఉన్నారు.