గణపురం :గణపురం మండలకేంద్రంలో ని కోటగుళ్లకు పూర్వ వైభవం కల్పించాలని భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు అన్నారు. మండల కేంద్రంలోని చారిత్రాత్మక కట్టడమైన కాకతీయుల కోటగుళ్లను సోమవారం సందర్శించారు. ఈసందర్భంగా సంపత్ రావును ఆలయ అర్చకులు సాదరంగా స్వాగతం పలికి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న గోమాతలకు సంపత్ రావు పండ్లను అందజేశారు. పూజా కార్యక్రమాల అనంతరం అర్చకులు నరేష్ తీర్థప్రసాదాలను అందజేసి ఆలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు ను శాలువాతో ఘనంగా సన్మానించారు.