భూపాలపల్లి టౌన్ : మహిళా ఆరోగ్య కార్యకర్త (ఏఎన్ఎం) పోస్టులకు దరఖాస్తుల గడువు పొడిగించినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరాం ఒక ప్రకటనలో తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో 17 ఏఎన్ఎంల పోస్టుల భర్తీకి అవుట్ సోర్సింగ్ పద్దతిన దరఖాస్తులు ఆహ్వానించమన్నారు. కాగా దరఖాస్తుల గడువును ఈ నెల 20వరకు పొడిగించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి 1వ జోన్లోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, కొమురంభీం జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.