భూపాలపల్లి :కోవిడ్ వ్యాక్సిన్పై ఇంకా భయమేంటి..దాదాపుగా జిల్లాలో వ్యాక్సినేషన్ చివరి దశకు చేరుకుంది..ప్రతి ఒక్కరూ ఆందోళన చెందకుండా వ్యాక్సిన్ వేయించుకుని ప్రాణాలు కాపాడుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ ప్రజలను కోరారు. సోమవారం మండలంలోని గొర్లవీడు గ్రామంలో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. చాలా మంది భయంతో వ్యాక్సిన్ వేసుకోకుండా ఉన్నారని తెలుసుకున్న డీఎంఅండ్హెచ్ఓ శ్రీరామ్, వైద్య అధికారులు, సిబ్బందితో గ్రామానికి వెళ్లి ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎంఅండ్హెచ్ఓ గ్రామస్తులతో మాట్లాడుతూ చాలా మంది మొదటి, రెండవ విడత వ్యాక్సిన్ను వేయించుకున్నారు. త్వరలో చిన్న పిల్లలకు సైతం వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.
ఈ పరిస్థితుల్లో గ్రామాల్లో ఇంకా భయంతో మొదటి దఫా వ్యాక్సిన్ తీసుకోని వాళ్లుండడం బాధాకరం. వ్యాక్సిన్తో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రజలందరూ వాక్సిన్ను తీసుకుని తమ ప్రాణాలను కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, ఎంపీపీ మందల లావణ్యసాగర్రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ రేణుక, సర్పంచ్ శంకరయ్య, టీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు మందల రవిందర్రెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఉమాదేవి, వైద్యాధికారులు డా.రవికుమార్, బాష్యానాయక్, సీహెచ్ఓ రాజయ్య, ఎంపీఓ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.