కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్నారం (సరస్వతి) బ్యారేజ్ లో 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఈమేరకు శుక్రవారం గోదావరి నుంచి 11300 క్యూసెక్కులు, మానేరు నది నుంచి 1000 క్యూసెక్కులు కలిపి మొత్తం 12300 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. అలాగే ప్రాజెక్టులోని 4గేట్లను ఎత్తి 3600 క్యూసెక్కులను ఔట్ ఫ్లో వదులుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. బరాజ్లో 10.87 టీఎంసీ నీరుకు గాను 09.02 టీఎంసీ నీరు ఉన్నట్లు వివరించారు.