జఫర్గఢ్ : మండలంలోని తమ్మడపల్లి(ఐ)కి చెందిన ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షుడు రడపాక ఆదాం భార్య రడపాక అరుణకు ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం మంజూరైన సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ చెక్కును మాజీ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆదివారం లబ్ధిదారులకు అందించారు. హన్మకొండలోని కడియం శ్రీహరి నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనారోగ్యానికి గురై హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మండలంలోని తమ్మడపల్లి(ఐ)కి చెందిన రడపాక అరుణ వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన రూ. 3లక్షల ఎల్వోసీ చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు మాజీ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అందించారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గాదెపాక అనిత, గ్రామాభివృద్ధి కమిటీ చైర్మెన్ సుధాకర్బాబు, మాజీ ఎంపీపీ గాదెపాక అయోద్య, టీఆర్ఎస్ నాయకులు రవి నాయక్, నవీన్ కుమార్, జయపాల్రెడ్డి, కుమారస్వామి ఉన్నారు.