సీఎంఆర్ ఇవ్వని మిల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝులిపించింది. ప్రభుత్వం కొనుగోలు చేసి ఇచ్చిన వడ్లను బియ్యంగా మార్చి తిరిగి ఇవ్వకుండా అక్రమాలకు పాల్పడిన నలుగురు మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. 2019-20 యాసంగి వడ్లను హనుమకొండ జిల్లాలోని 52 మిల్లులకు కేటాయించగా, 2021 మార్చి 31లోపు సీఎంఆర్ ఇవ్వాల్సి ఉంది. గడువు పెంచినా నిర్లక్ష్యం చేసిన మిల్లుల్లో అధికారుల బృందాలు తనిఖీ చేశాయి. 12 మందికి నోటీసులు జారీ చేయగా ఎనిమిది మంది మాత్రమే స్పందించడంతో మరో నలుగురిపై ప్రభుత్వం తక్షణ చర్యలకు ఉపక్రమించింది.
వరంగల్, మే 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీఎంఆర్ విషయంలో అక్రమాలకు పాల్పడిన మిల్లర్ల పై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నది. గడువు ముగిసి రెండేండ్లవుతున్నా బియ్యం ఇంకా ఇవ్వని మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. 2019-20 యాసంగి వడ్లను బియ్యంగా మార్చేందు కు హనుమకొండ జిల్లాలోని 52 మిల్లులకు కేటా యించారు. 2021 మార్చి 31లోపు ఈ మిల్లుల యజ మానులు బియ్యం తిరిగి ఇవ్వాల్సి ఉండగా 12 మిల్లల నుంచి ఇవ్వలేదు. ప్రభుత్వం బియ్యం ఇచ్చేందుకు గడువు పెంచింది. కొందరు మిల్లర్ల తీరులో మార్పు లేకపోవడంతో 25 శాతం జరిమానాతో బియ్యం ఇవ్వాలని ఆదేశించింది. 100 కిలోల బియ్యం ఇచ్చే వారు అదనంగా మరో 25 కిలోలు కలిపి ఇచ్చేలా ఆదే శాలు జారీ చేసింది. జరిమానా గడువు ముగిసినా కొం దరు మిల్లర్లు బియ్యం తిరిగివ్వలేదు. ఇలాంటి వారికి అదనంగా 25 శాతం, 12 శాతం మిత్తితోపాటు ఇవ్వా లని నోటీసులిచ్చింది. ప్రభుత్వ చర్యలతో కొందరు రైస్ మిల్లర్లు బియ్యం తిరిగి ఇచ్చారు. మరికొందరు నిర్ల క్ష్యంగా వ్యవహరించారు. ఇలాంటి మిల్లుల్లో అధికారు లు తనిఖీ చేశారు. సర్కారు ఇచ్చిన వడ్లను బియ్యంగా మార్చి బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నారని తేలిం ది. దీంతో ప్రభుత్వ అనుమతితో ఇలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. హనుమకొండ జిల్లాలో ఇలా 12 మంది మిల్లర్లపై చర్యలు చేపట్టారు. నోటీసుల అనంతరం ఆరుగురు మిల్లర్లు స్పందించారు. మరో ఇద్దరు మిల్లర్లు కొంత మేరకు బియ్యం ఇచ్చారు. మిగిలిన నలుగురిపై ఇటీవ ల క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
ప్రభుత్వం కొనుగోలు చేసి ఇచ్చే వడ్లను బియ్యంగా మార్చి గడువులోపు ఇచ్చే విషయంలో కొందరు మిల్ల ర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. మిల్లర్ల అక్రమా లతో సీఎంఆర్ ప్రక్రియ నిర్వహించే రాష్ట్ర పౌరసర ఫరాల సంస్థకు నష్టం వస్తున్నది. ప్రభుత్వ నిధులతో వడ్లను కొనుగోలు చేసి వాటిని గడువులోపు బియ్యం గా మార్చి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్సీఐ) కు ఇస్తేనే పౌర సరఫరాల సంస్థకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. సీఎంఆర్లో జాప్యం జరిగితే వడ్ల కొనుగోలు కోసం బ్యాంకుల నుంచి తెచ్చిన నిధులకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బియ్యం ఇవ్వని మిల్లర్లపై చర్యలు చేపట్టింది. 2019-20 యాసంగిలో బాలాజీ స్టేక్ రైస్ ఇండస్ట్రీస్, వసుధ లక్ష్మీ ఇండస్ట్రీస్, లక్ష్మీ వెంకటేశ్వర ఇండస్ట్రీస్, కార్తికేయ ఇండస్ట్రీస్, అంజనీ ఆగ్రో ఇండస్ట్రీస్, నారాయణ ఆగ్రో ఇండస్ట్రీస్, రుద్రమాంబ ఆగ్రో ఇండస్ట్రీస్, శ్రీబాలాజీ ఇండస్ట్రీస్, వైష్ణవీ ఇండస్ట్రీస్, శ్రీభాగ్యలక్ష్మీ ఆగ్రో ఇండ స్ట్రీస్, హిందుస్థాన్ ఆగ్రో ఇండస్ట్రీస్, శ్రీమాత ఎంటర్ప్రై జెస్ మిల్లులకు సివిల్ సప్లయీస్ అధికారులు 75,111 టన్నుల వడ్లు ఇచ్చారు. వీటిని మిల్లింగ్ చేసి 51,279 టన్నుల బియ్యాన్ని 2021 మార్చి 31లోపు ఇవ్వాలి. గడువు వరకు 17,762 టన్నుల బియ్యం పెండింగ్లో పెట్టారు.
పెండింగ్లో పెట్టిన బియ్యానికి 25 శాతం జరి మానాతో ఇవ్వాలని పౌర సరఫరాల సంస్థ నోటీసులు ఇచ్చింది. అయినా పెనాల్టీ ప్రక్రియ అనంతరం బాలా జీ స్టేక్ రైస్ ఇండస్ట్రీస్(హసన్పర్తి), వసుధలక్ష్మీ ఇండ స్ట్రీస్ (మునిపల్లి), లక్ష్మీ వెంకటేశ్వర ఇండస్ట్రీస్ (స్తంభంపల్లి), కార్తికేయ ఇండస్ట్రీస్ (నక్కలపల్లి) మిల్ల్లు లు బియ్యం ఇవ్వలేదు. ఈ నాలుగు మిల్లలు ఇవ్వాల్సి న బియ్యం 8,878 టన్నులు. ప్రభుత్వ ధర ప్రకారం రూ.37.36 కోట్ల బియ్యాన్ని ఈ నాలుగు మిల్లులు పక్కదారి పట్టించినట్లు తేలింది. వీటి యజమానులైన సిరిగినేని వెంగళరావు, ముద్దబోయిన ప్రవీణ్కుమార్, మినుకూరి వెంకటరెడ్డి, సిద్ధంశెట్టి విష్ణుకుమార్పై సివిల్ సప్లయ్ అధికారులు స్థానిక పోలీసు స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
కేసుతోపాటు రెవెన్యూ రికవరీ చట్టం కింద వారి వద్ద నుంచి రావాల్సిన బియ్యం మేర కు మొత్తాన్ని తిరిగి రాబట్టనున్నారు. జరిమానా నోటీ సుల అనంతరం అంజనీ ఆగ్రో ఇండస్ట్రీస్, రుద్రమాంబ మిల్లుల యజమానులు సగం బియ్యాన్ని తిరిగిచ్చారు. మిగిలిన బియ్యం ఇచ్చేందుకు గడువు కోరారు. నారా యణ ఆగ్రో ఇండస్ట్రీస్, శ్రీబాలాజీ ఇండస్ట్రీస్, వైష్ణవీ ఇండస్ట్రీస్, శ్రీభాగ్యలక్ష్మీ ఆగ్రో ఇండస్ట్రీస్, హిందుస్థాన్ ఆగ్రో ఇండస్ట్రీస్, శ్రీమాత ఎంటర్ప్రైజెస్ మిల్లుల యజ మానులు సీఎంఆర్ బియ్యాన్ని తిరిగిచ్చారు. జరిమానా కింద బియ్యం విషయం పెండింగ్లో ఉంది. జరిమానా నుంచి మినహాయింపు ఇవ్వాలని ఈ ఆరుగురు మిల్లర్లు కోరుతున్నట్లు తెలిసింది.