నేటి నుంచి రెండు రోజులపాటు హనుమకొండ జేఎన్ఎస్లో అథ్లెటిక్స్ మీట్
17 ఈవెంట్లు.. 800 మంది క్రీడాకారులు
35 ఏళ్ల నుంచి వందేళ్ల పైబడిన వారి రాక
అన్ని ఏర్పాట్లు చేశాం: ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్
హనుమకొండ చౌరస్తా, మార్చి 25: అనుభవజ్ఞుల ఆట ల పోటీలకు తొలిసారిగా హనుమకొండ ఆతిథ్యం ఇస్తున్న ది. నేడు, రేపు జవహర్లాల్ నెహ్రూ స్టేడియం (జేఎన్ ఎస్)లో 8వ రాష్ట్ర వెటరన్ అథ్లెటిక్స్ మీట్ జరుగనుండగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంతర్జాతీయ సౌకర్యాలతో కూడిన అధునాతన సింథటిక్ ట్రాక్ అందుబాటులో ఉం ది. మాస్టర్స్ అథ్లెట్లను వెటరన్స్ అని కూడా పిలుస్తారు. 35ఏళ్ల నుంచి 100 ఏళ్లు పైబడిన మాస్టర్స్ ఇందులో పా ల్గొంటున్నారు. 28 జిల్లాల నుంచి 800 మంది మాస్టర్ అథ్లెట్లు హాజరవుతున్నారు. 17 ఈవెంట్లలో మహిళలు, పురుషుల విభాగాల వారీగా రన్నింగ్, జంపింగ్, త్రోయింగ్లో పోటీ పడనున్నారు. వెయ్యి మందికిపైగా క్రీడాకారులు, కోచ్లు, ఆర్గనైజర్లతో జేఎన్ఎస్ సందడిగా మారనుంది. శనివారం ఉదయం 5కిలోమీటర్ల పరుగు పందెంతో పోటీలు ప్రారంభం కానున్నాయి.
ప్రత్యేక ఆకర్షణగా 101 ఏళ్ల అథ్లెట్
ఈ పోటీల్లో హైదరాబాద్కు చెందిన 101 ఏళ్ల రన్నర్ విజయ రాంచంద్రారెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలువను న్నా రు. ఆయన 100 మీటర్స్ స్ప్రింట్లో పాల్గొననున్నారు. వందేళ్లకు పైబడిన రాంచంద్రారెడ్డి ఎంతో మంది క్రీడా కారుల్లో స్ఫూర్తినింపనున్నారు.
అంతర్జాతీయ క్రీడలకు ఓరుగల్లు వేదిక : ప్రభుత్వ చీఫ్విప్ అంతర్జాతీయ క్రీడలకు వరంగల్ మహానగరం వేదికగా మారిందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. శుక్రవారం జేఎన్ఎస్లోని ఇండోర్ స్టేడియంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీ ఆర్ చొరవతో వరంగల్ అన్ని విధాలా అభివృద్ధి చెందింద న్నారు. నగరాన్ని ఎడ్యుకేషనల్, హెల్త్ హబ్గా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. ఇప్పుడు క్రీడా హబ్గా తీర్చిదిద్దే ప్రయత్నం కొనసాగుతున్నదని, క్రీడాకారులను ప్రోత్సహించేలా మైదానాలను తీర్చిదిద్దుతున్నామని చెప్పా రు. వెటరన్ అథ్లెటిక్స్ మీట్లో 800 మంది అథ్లెట్స్, 200 మంది సిబ్బంది పాల్గొంటున్నారని, వారికి సకల సౌకర్యా లు కల్పిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్కు చెందిన 101 సంవత్సరాల అథ్లెట్ ఈ పోటీల్లో పాల్గొంటున్నారని వివరించారు. పోటీలను మంత్రులు శ్రీనివాస్గౌడ్, ఎర్రబె ల్లి దయాకర్రావు ప్రారంభిస్తారని చెప్పారు. ముగింపు కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి వస్తారని తెలిపారు. అందరి సమన్వయంతో స్పోర్ట్స్ మీట్ను విజయవంతం చేస్తామన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్, నేషనల్ మాస్టర్ అథ్లెటిక్ అసోసియే షన్ హనుమకొండ జిల్లా ప్రెసిడెంట్ జంగం బాబూరావు, కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ పాల్గొన్నారు.
స్ఫూర్తిదాయకంగా ఉండేందుకే..
ప్రస్తుత పోటీ ప్రపంచంలో క్రీడలు ఆరోగ్యానికి దోహదపడుతాయి. 30ఏళ్ల వయస్సులోనే అనారోగ్యా నికి గురవుతున్న ఈ రోజుల్లో ఇతరులకు స్ఫూర్తిదా యకంగా ఉండేందుకే హనుమకొండలో వెటరన్ అథ్లె టిక్స్ మీట్ నిర్వహిస్తున్నాం. మహిళలకు, పురుషులకు ప్రత్యేక విభాగాల్లో మొత్తం 13 ఈవెంట్స్లో అన్ని రకాల జంప్స్, త్రో, డిస్క్ త్రో, 100, 200, 400 మీ టర్ల పరుగు పోటీలు నిర్వ హిస్తున్నాం. ‘హెల్త్ ఈజ్ వెల్త్’ అనే కాన్సెప్ట్తో ఈ కార్య క్రమాన్ని ఏర్పాటు చే శాం. 60 ప్లస్లో కూడా నేను పోటీల్లో పాల్గొంటున్నా.
– కూరాకుల భారతి, నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్