భూపాలపల్లి, మార్చి 25: ప్రజా సమస్యలు పరిష్కరించడంలో అధికారులు బాధ్యతతో పని చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సూచించారు. శుక్రవారం స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో ఎంపీపీ మందల లావణ్య అధ్యక్షతన భూపాలపల్లి మండల ప్రత్యే క సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. మండలంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై వివిధ శాఖల అధికారులు వివరించగా, పలు గ్రామాల్లో నెలకొన్న కొద్దిపాటి సమస్యలపై పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు ప్రస్తావించగా, వాటిని సావధానంగా విన్న ఎమ్మెల్యే సం బంధిత అధికారులకు నిర్ణీత గడువు ఇచ్చి సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్య, వ్యవసాయం, సాగునీటి రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తుందని, దీనిలో భాగంగా ‘మన ఊరు- మనబడి’ కార్యక్రమం చేపట్టిందన్నారు. దీనిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో అవసమైన చోట అదనపు తరగతి గదుల నిర్మాణంతో పాటు, మౌలిక వసతులను కల్పించాడానికి గాను రూ. 7,289 కోట్ల నిధులను కేటాయించిందన్నారు.
సోమ, మంగళవారాల్లో భూపాలపల్లి నియోజక వర్గంలో తరగతి గది నిర్మాణానికి శంకుస్థాపన చేసి మన ఊరు-మనబడి కార్యక్రమం ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లాకు 500 పడకల దవాఖాన, మెడికల్ కళాశాల, ఆయూష్ దవాఖాన మంజూరు చేసినందుకు గాను సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యే రమణారెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రైతులు ఎక్కువగా ప్రతి యేటా ఒకే పంట వేయకుండా ఇతర పంటలు పండించే లా వ్యవసాయ అధికారులు దృష్టిపెట్టాలని సూచించారు. పాల ఉత్పత్తి పెంపునకు పశువుల పెంపకం, అదే విధంగా కోళ్లు, గొర్రెలు, మేకలు పెంపకం విరివిరిగా రైతులు పెంపకం చేపట్టేలా సంబంధిత శాఖల అధికారులు మరింత దృష్టిపెట్టాలన్నారు.
వేసవి కాలంలో ప్రధానంగా తాగునీటి, కరంట్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత పెంచేలా బోధన చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. జూన్ 2 నుంచి కొత్త పింఛన్లు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వచ్చే మూడు నెలలు ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఉపాధిహామీ కూలీలకు ఎక్కువ పనిదినాలు కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలపై వ్యవహరిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ మండల సభలో తెలంగాణలో పండిన రబీ వరి ధాన్యా న్ని మొత్తం కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేస్తూ ఎకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ కళ్లేపు శోభరఘుపతిరావు, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్కుమార్, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు ఎంపీడీవో అనిల్కుమార్, డిప్యూటీ తహసీల్దార్ మహ్మద్ షఫీ, సూరింటెండెంట్ రవీందర్ ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.