అన్ని ప్రభుత్వ బడుల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు : కలెక్టర్ గోపి
హైదరాబాద్ నుంచి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వర్చువల్ మీటింగ్
కరీమాబాద్, మార్చి 14 : తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8 తరగతి వరకు అన్ని ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధించాలని కలెక్టర్ గోపి సంబంధిత అధికారులకు సూచించారు. ఆంగ్ల మాధ్యమ విద్యా బోధన అంశంపై ఉర్సు బైపాస్ రోడ్డులోని తాళ్ల పద్మావతి పాఠశాలలో ఏర్పాటు చేసిన 5 రోజుల అవగాహన సదస్సును సోమవారం హైదరాబాద్ నుంచి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వర్చువల్ మీటింగ్ను ప్రాంభించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యాబోధనకు తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యాశాఖ సిబ్బంది ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పని చేయాలన్నారు. ప్రభుత్వ సహకారంతో సమస్యలను పరిష్కరించి ముందుకు సాగాలన్నారు. డీఈవో వాసంతి పాల్గొన్నారు.