వరంగల్ చౌరస్తా, సెప్టెంబర్ 16: తపాలా శాఖ విదేశీ సేవలను తిరిగి పునఃప్రారంభించిందని వరంగల్ డివిజన్ తపాలా సూపరింటెండెంట్ జీ ఉమామహేశ్వర్రావు తెలిపారు. గురువారం ఆ యన వరంగల్ ప్రధాన తపాలా కార్యాలయంలో వివరాలను తెలియజేశారు. కరోనాకు ముందు ప్ర జలకు అందుబాటులో ఉండే విదేశీ వస్తు, ఉత్తర రవాణా సేవలను పునఃప్రారంభించామన్నారు. గతంలో కంటే ఎక్కువగా సుమారు 208 దేశాల కు ఈ సేవలను విస్తరించడానికి ప్రత్యేక కార్యాచ రణ చేపట్టామని ఆయన తెలిపారు. ఒక మీటరు విస్తీర్ణం కలిగి ఉండి, సుమారు 20 కిలోల లోపు బరువుకు కలిగిన వస్తువులను మాత్రమే తీసు కుంటామని పేర్కొన్నారు. దేశీయ వ్యాపార, వా ణిజ్య, చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించ డం కోసం కనిష్ఠ రుసుం కూ. 200, గరిష్ఠంగా రూ. 600లను మాత్రమే చార్జ్ చేస్తూ ఇతర దేశాల కు తరలిస్తామని ఆయన తెలిపారు. ప్రతి 500 గ్రాముల బరువుకు ఒక టారిఫ్ అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. దేశీయ వస్తువులు, గృ హోపకరణాలు, వస్ర్తాలు, అనుమతులు కలిగిన ఆహార పదార్థాలను రవాణా చేయడానికి దసరా నుంచి సంక్రాంతి వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టామ ని తెలిపారు. నూనె, మందుగుండు సామగ్రి, జం తువులు, అగ్ని ప్రమాద కారణాలను అను మతిం చమని చెప్పారు. ఈ డ్రైవ్ తదుపరి సైతం సేవల ను యథా తథంగా కొనసాగిస్తామని తెలిపారు. డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రభాకర్ ఉన్నారు.