లింగాల గణపురం : జనగామ జిల్లా లింగాల గణపురం మండల ఏనెబావి గ్రామంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేసీఆర్ హయాంలో నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడి ఏడు సంవత్సరాలు అవుతున్నది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ మండల కన్వీనర్ చౌదరి పెళ్లి శేఖర్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ పుట్ట సుజాత, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..గతంలో తమ గ్రామం మాణిక్యపురంలో ఉండేది అన్నారు, ప్రతి పనికి అక్కడికి వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డామన్నారు. కేసీఆర్ పాలనలో ఏనెబావి, పిట్టలోని గూడెం గ్రామాలను కలుపుతూ ఏనెబావిని నూతన గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయడం తమ కష్టాలు తొలగిపోయాయన్నారు.