ఫిబ్రవరి 11న సీఎం కేసీఆర్ జనగాం జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈసందర్భంగా జనగాంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించానున్నారు. దాని కోసం సభా స్థలాన్ని రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు యాదగిరిరెడ్డి, రాజయ్య తదితరులు పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ… లక్ష మందితో నిర్వహించే బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సభా వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని స్పష్టం చేశారు. 11 వ తేదీన సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టరేట్ని ప్రారంభిస్తారని, తర్వాత పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారని, పార్టీ కార్యాలయం సమీపంలోనే ఏర్పాటు చేసే బహిరంగ సభలో మాట్లాడుతారని మంత్రులు వెల్లడించారు.
బహిరంగ సభకు జిల్లా వ్యాప్తంగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలి వస్తారని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రులు తెలిపారు.