వలసలను అరికట్టి, స్థానికంగానే ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలో బీజేపీ సర్కారు నిర్లక్ష్యం చేస్తున్నది. కూలీల పొట్టగొట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుండగా, రాష్ట్ర సర్కారు మాత్రం వీరికి అండగా ఉంటున్నది. ప్రస్తుతం ప్రమాద బీమా రూ.50వేల వరకు అందుతుండగా, తెలంగాణ ప్రభుత్వం దానిని రూ.2లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది. జిల్లాలో 2,32,128 జాబ్కార్డులుండగా 5,23,288 మంది కూలీలు ఉన్నారు. వీరిలో 2,95,761మంది పనులకు వెళ్తున్నారు. పని చేసే ప్రదేశంలో కూలీలకు ప్రమాదం జరిగితే బీమా వర్తిస్తుందని అధికారులు తెలిపారు.
నర్సింహులపేట, అక్టోబర్ 14 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్లక్ష్యం చేస్తున్నది. కూలీల పొట్టగొట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నది. గ్రామాల్లో వలసలను అరికట్టి, స్థానికంగానే ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో 2005లో నాటి ప్రభుత్వం ఉపాధి హమీ పథకాన్ని ప్రారంభిస్తే బీజేపీ ప్రభుత్వం ఎనిమిదేళ్లుగా కూలీలకు సరైన రీతిలో పని కల్పించకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. ఈ నేపథ్యం లో రెక్కల కష్టాన్నే నమ్ముకున్న కూలీలకు రాష్ట్ర సర్కారు అండగా నిలుస్తున్నది. ప్రస్తుతం ఉపాధి కూలీలకు బీమా రూ.50వేలు ఉండగా, రూ.2లక్షలకు పెంచింది.
జిల్లాలో 2,32,128జాబ్కార్డులుండగా 5,23,28 8 మంది కూలీలు ఉన్నారు. వీరిలో 2,95,761మంది కూలీలు రోజూవారీగా పనులకు వెళ్తున్నారు. పనిచేసే ప్రాంతాల్లో కొన్నిసార్లు ప్రమాదా లు జరిగి కూలీలు తాత్కాలిక లేదా శాశ్వత వైకల్యాన్ని పొందుతున్నారు. పాములు, తేలు కాటుకు గురై మృ త్యువాత పడే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో కూలీల కుటుంబాలకు భరోసా కల్పించేందుకు గతంలో ఉన్న రూ.50 వేల బీమాను రూ.2లక్షలకు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సందీప్కుమర్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కూలీలకు నాలుగు విధాలా లాభం కలుగనుంది. ఉపాధి పనులు చేస్తూ గా యపడినా, శాశ్వత వైకల్యం కలిగినా గతంలో రూ. 25వేలు ఇచ్చే వారు. ప్రస్తుతం రాష్ట్ర సర్కారు రూ. లక్ష కు పెంచింది. పనికి వచ్చిన కూలీకి పక్షవాతం వస్తే గతంలో రూ.50వేలు ఇచ్చేవారు. ఇప్పుడు రూ. 2 లక్ష లు, పనికి వచ్చిన మహిళల వెంట ఆరేళ్లలోపు పిల్లలు ఉండి, ప్రమాదానికి గురైతే రూ.లక్ష, పనిప్రదేశంలో గాయపడి మరణిస్తే వారి వెం ట వచ్చే పిల్లలకు రూ.2లక్షల బీమా సొమ్ము చెల్లించేలా రాష్ట్ర ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, జిల్లాలో కూలీలు 5,23,288 మంది ఉండగా, 2,95,761 మంది పనులకు వస్తున్నారు. పనికి వచ్చే కూలీలకు పని ప్రదేశంలో ప్రమా దం జరిగితే బీమా వర్తిస్తుందని డీఆర్డీవో నారాయణ తెలిపారు.
బీమాతో భరోసా
ఉపాధి కూలీలకు తెలంగాణ సర్కారు శుభవార్త చెప్పింది. పనికి వెళ్లి ప్రమాదానికి గురైన వారికి బీమా సొమ్ము రూ. 50వేల నుంచి రూ.2లక్షలకు పెంచింది. దీంతో పేద కుటుంబాలకు ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది.గతంలో ప్రమాదాలకు గురైన వారికి వైద్యఖర్చులకు డబ్బులు సరిపొక ఇబ్బందులుపడ్డారు. ప్రభు త్వం బీమాతో దీమా కల్పించింది.
– చలమల్ల మురళి, ఉపాధి కూలీ, పెద్దనాగారం