పాలకుర్తి :ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండ ప్రకాష్కు ఎమ్మెల్సీ అవకాశం కల్పించడం పట్ల ముదిరాజ్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు మాచర్ల ఎల్లయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ కన్వీనర్ చిక్కుడు రాములు మాట్లాడుతూ రాష్ట్రంలో ముదిరాజులను గుర్తించి సీఎం కేసీఆర్ ముదిరాజ్లకు శాసన మండలిలో అవకాశం కల్పించడం హర్షణీయమని అన్నారు.
ఈ సమావేశంలో మండల కార్యదర్శి మామిండ్ల లక్ష్మణ్, నీరటి కొమురయ్య ,రేగుల కృష్ణ ,కాశిబోయిన సాయి, శేరు వెంకన్న ,పసుల వెంకటేష్, సురేష్ నరసయ్య పాల్గొన్నారు.