జనగామ : జీడికల్ కమాన్ నుంచి పెంబర్తి ఫోర్ లైన్ రోడ్డు పనులను జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గురువారం ప్రారంభించారు. వర్షా కాలం నేపథ్యంలో వారం రోజుల్లో పనులు పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ను ఆదేశించారు. జీడికల్ కమాన్ నుంచి పెంబర్తి బైపాస్ వరకు రోడ్డు ఇరుకుగా ఉందని అభ్యర్థించిన వెంటనే రూ.రెండు కోట్ల ఎనబై లక్షలు మంజూరు చేసిన సీఎంకేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు జనగామ ప్రజల పక్షాన ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున, వైస్ చైర్మన్ రాం ప్రసాద్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పాండు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేష్ రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.