జనగామ రూరల్, ఫిబ్రవరి 11 : దివ్యాంగులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నా రు. శుక్రవారం మండలంలోని యశ్వంతాపూర్ టీఆర్ఎస్ కా ర్యాలయంలో పాలకుర్తికి చెందిన 105 మంది దివ్యాంగులకు ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మూడు చక్రాల మోటా ర్ వాహనాలు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా వారికి అందజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ లబ్ధిదారులతో మాట్లాడారు. దివ్యాంగుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని చెప్పారు. మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పాలకుర్తికి చెందిన లబ్ధిదారులకు మూడు చక్రాల వాహనాలు అందించిన మంత్రి ఎర్రబెల్లిని సీఎం అభినందించారు. పేదలకు ఎప్పుడు తోడుగా ఉండే దయాకర్కు మీరు అండగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.