జనగామ : నిరంతరం ప్రజా సేవలోనే ఉంటాను. సీఎం కేసీఆర్ నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లప్పుడు కృషి చేస్తానని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో హౌసింగ్ బోర్డుకు చెందిన 19 ఎకరాల స్థలాన్ని మెడికల్ కళాశాల నిర్మాణం కోసం వైద్య శాఖకు భూమికి సంబంధించిన పత్రాలు అందజేశారు.
మెడికల్ కళాశాల భూమి పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే భావోగ్వేదానికి గురై కంట తడి పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జనగామకు మెడికల్ కాలేజీ రావడంతో తన జన్మ ధన్యం అయిందన్నారు. జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావుకు కృతజ్ఞతలు. తెలిపారు.
నాటి ఉద్యమం నుంచి ప్రత్యేక రాష్ట్ర సాకారం వరకు కేసీఆర్ తో నడిచిన అనుభూతులు మర్చిపోలేనివన్నారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. అనంతరం తరిగొప్పుల మండలానికి చెందిన ఒకరికి దళిత బంధు పథకం కింద మంజూరైన ట్రాక్టర్ను పంపిణీ చేశారు.