చిల్పూరు : మండల కేంద్రంలోని రాజవరం గ్రామంతో పాటు మరికొన్ని గ్రామాల్లో సోమవారం జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ కానుకగా చీరలను పంపిణీ చేస్తుందని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని పేర్కొన్నారు.
18 సంవత్సరాలు నిండిన మహిళలకు వీటిని అందజేస్తుందని తెలిపారు. ఆడపడుచుల సంతోషానికి అనేక పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ చిల్పూరు, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మామిడాల లింగారెడ్డి, శ్రీపతిపల్లి గ్రామంలో సర్పంచ్ ప్రత్యూషరెడ్డి, చిల్పూరు గ్రామంలో సర్పంచ్ ఉద్దెమరి రాజ్కుమార్, గార్లగండ తండాలో మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ మాలోతు రమేశ్ నాయక్, గ్రామ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.