ములుగుటౌన్, నవంబర్ 8 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. కలెక్టరేట్లోని ఆడిటోరియంలో ఎంఈవో, హెచ్ఎంలతో ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టాల్సిన చర్యలపై సోమవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఉపాధ్యాయుడు ఉదయం 9 గంటలకు విధిగా పాఠశాలకు హాజరుకావాలన్నారు. కరోనా నేపథ్యంలో పాఠశాలలు నడవక విద్యార్థులు చదువులో వెనుకబడ్డారని అన్నారు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను గాడిలో పెట్టాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఆన్లైన్ అటెండెన్స్ విధిగా పాటించాలని సూచించారు. ఏ ఒక్క విద్యార్థి డ్రాప్ఔట్ కాకుండా చూసుకోవాలన్నారు. ఎవరైనా డ్రాప్ఔట్ అయితే క్లాస్టీచర్, ఎన్సీఆర్పీ, సీఆర్పీ బాధ్యత వహించి విద్యార్థి తిరిగి పాఠశాలకు వచ్చేలా చూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల సిలబస్ పూర్తిచేసి విద్యా నైపుణ్యాలు మెరుగుపడేలా చూడాలన్నారు. ప్రతి ఉపాధ్యాయుడి డెయిరీ, లెస్సెన్ డెయిరీ క్షేత్ర స్థాయిలో పరిశీలించాలన్నారు. విలేజ్ ఎడ్యుకేషన్ లిస్ట్ అప్లోడ్ చేయాలని సూచించారు. ప్రతి ఉపాధ్యాయుడు సక్రమంగా బోధిస్తున్నాడా? లేదా? అనేది హెచ్ఎంలు పరిశీలించాలన్నారు. అర్హత కలిగిన ఎస్సీ విద్యార్థులకు పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయులు అనారోగ్యానికి గురైతే అన్లైన్ లీవ్ ఐప్లె చేసుకునేలా చూడాలన్నారు. సమావేశంలో డీఈ వో జీ పాణిని, సమగ్ర శిక్షణ క్వాలిటీ కో ఆర్డినేటర్ సుదర్శన్రెడ్డి, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి భాగ్యలక్ష్మి, డీసీసీబీ సెక్రెటరీ విజయలక్ష్మి, ఎంఈవోలు, పీఎస్, యూపీఎస్, హైస్కూల్ హెచ్ఎంలు పాల్గొన్నారు.
ప్రజావాణి విఙ్ఞప్తులను పరిష్కరించాలి
ములుగుటౌన్, నవంబర్ 8 : ప్రజావాణిలో పలు సమస్యలపై ప్రజలు అందించే విఙ్ఞప్తులను వెంటనే పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ కృష్ణఆదిత్య అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో పలు సమస్యలపై వచ్చిన వినతులను సోమవారం ఆయన స్వీకరించి ఆయా శాఖలకు అప్పగించారు. వినతులు ఏ శాఖలో ఎక్కడ పెండంగ్ ఉందో, పరిష్కరింపంబడితే, తిరస్కరించబడితే దానికి గల కారణాలు తెలుపుతూ మెస్సేజ్ రూపంలో ఫిర్యాదు దారుడికి చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు.