డోర్నకల్, జూలై 29 : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యానాయక్ పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని వెన్నారంలో సీపీఎం కార్యకర్త కాసర్ల శ్రీనివాస్ ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరగా, పార్టీ జెండా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు.
బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ..
డోర్నకల్ మండల పరిధిలోని ఉయ్యాలవాడలో ఇటీవల విద్యుదాఘాతంతో రైతు వక్కంతుల శ్రీనివాస్ (48) మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఆయన ఇంటికి వెళ్లి, కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సాయం త్వరలోనే అందేలా చూసి, కుటుంబానికి అండగా నిలుస్తామన్నారు. ఆయన వెంట టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నున్న రమణ, ఉయ్యాలవాడ ఎంపీటీసీ నున్న మల్లికార్జున్, సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షుడు బోయనపల్లి వెంకన్న, మండల కో ఆప్షన్ సభ్యుడు షేక్ లాల్ మియా, పీఏసీఎస్ వైస్ చైర్మన్ శెట్టి వెంకన్న, ముల్కలపల్లి సర్పంచ్ జవ్వాజీ రాంప్రసాద్, మన్నెగూడె ఎంపీటీసీ జైపాల్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పొడిశెట్టి రామనాథం, డీఎస్ కృష్ణ, మధు, ఇంజం కృష్ణయ్య పాల్గొన్నారు.