హనుమకొండ చౌరస్తా, మార్చి 31: తెలంగాణ ప్రభుత్వంలో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉం దని, ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై సర్కారు సీరియస్గా ఉందని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవారెడ్డి అన్నారు. దీనిపై ఇప్పటికే సిట్ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం నివేదిక అందగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. శుక్రవారం కాకతీయ యూనివర్సిటీ ప్రాంగణంలో టీఆర్ఎస్వీ నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. వాసుదేవరెడ్డి మాట్లాడుతూ రద్దయిన పరీక్షలకు ఇప్పటికే రెండు పరీక్షలకు తేదీలు ఇచ్చారని, వీలైనంత త్వరగా మిగతా రెండు పరీక్షలకు తేదీలను ప్రకటించడానికి చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని, ఉచిత స్టడీ మెటీరియల్స్, గ్రంథాలయాలు 24 గంటలు తెరిచేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అకడే వారికి భోజన సదుపాయం, సాయం త్రం స్నాక్స్ ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. దీనిని విద్యార్థులు వినియోగించుకుని ఉన్నత ఉద్యోగంలో స్థిరపడాలని ఆయన పిలుపునిచ్చారు. ఉద్యమ నేత కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలోని అన్ని రంగాలను అభివృద్ధి చేస్తున్నారని వాసుదేవారెడ్డి తెలిపారు. దేశంలో ఎకడాలేని విధంగా 1,32,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేశార న్నారు. రెండోసారి ప్రభుత్వంలో 90 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశారన్నారు. పైరవీలకు తావులేకుండా ఉద్యోగాలు భర్తీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయాన్ని వివరించారు. బీజేపీ నేత బండి సంజయ్కి చిత్తచుద్ధి ఉంటే కేంద్రంలో ఖాళీగా ఉన్న 10 లక్షల ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాలను భర్తీ చేసేలా ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు. సెంట్రల్ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న 11,500 ఉద్యోగాలను నింపి నిరుద్యోగులకు అండగా ఉండాలన్నారు. తెలంగాణలో టీఎస్పీఎస్సీ పనితీరును యూపీఎస్సీ అనేక రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు పరిశీలించి అభినందించాయని ఆయన గుర్తుచేశారు. టీఎస్పీఎస్సీలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులతో పేపర్ లీకేజీ జరిగి విద్యార్థులు గందరగోళానికి గురయ్యారని, ఈ అంశాన్ని కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఇద్దరు ఉద్యోగులు చేసిన తప్పును వ్యవస్థపై, నాయకులపై రుద్దడం విపక్షాలకు సమంజసం కాదన్నారు. టీఎస్పీఎస్సీపై ఆరోపణల విషయంలో బండి సంజయ్కి సిట్ నోటీసులు ఇస్తే హాజరుకాకుండా తిరుగుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసులకు భయపడే వ్యక్తులు కారని వాసుదేవారెడ్డి అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ జా తీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతో ష్ అడ్డంగా దొరికారని, కోర్టులను అడ్డుపెట్టుకుని స్టే తెచ్చుకుని విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. విద్యార్థులు, ఉద్యమకారుల సమస్యలపై ప్రభుత్వం మొదటి నుంచి సానుకూలంగా ఉం దని, ప్రతిపక్షాల మాయలో పడి తమ ఉజ్వలమైన భవిష్యత్ను పాడుచేసుకోవద్దన్నారు. కాకతీయ యూనివర్సిటీలో ఇటీవల జరిగిన ఘటనలకు కారణం కొన్ని రాజకీయ పార్టీలు, శక్తులేనన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు కుట్రలకు పాల్పడుతూ రెచ్చగొట్టే మాటలతో ప్రభుత్వంపై చెడు ప్రచారానికి పూనుకున్నారని ఆయన విమర్శించారు. యూనివర్సిటీలను అభివృద్ధి చేయాలని, ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలనే సంకల్పంతో ఉందన్నారు. అసెంబ్లీలో యూనివర్సిటీ రిక్రూట్మెంట్ బిల్లు పాస్ చేసినా రాష్ట్ర గవర్నర్ మాత్రం దీనికి ఆమోదం తెలుపకుండా బీజేపీ నేతల ఒత్తిడితో కుట్ర పూరితంగా ఆపిందన్నారు. ప్రతి సంవత్సరం బడ్జెట్ కేటాయింపుల్లో కాకతీయ యూనివర్సిటీ బ్లాక్ గ్రాంట్ రూ.31 కోట్లు విడుదల చేసిందని, రెండో విడుతగా రూ.9 కోట్లు విడుదల చేసిందన్నారు. ప్రభుత్వం కేయూ గ్రాంట్ను కూడా పెంచిందని ఆయన గుర్తుచేశారు. కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధి కోసం విద్యార్థి నాయకులు కూడా కలిసిరావాలని కోరారు. విలేకరుల సమావేశంలో డాక్టర్ బొల్లికొండ వీరేందర్, మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్, డాక్టర్ పీ కొమురయ్య, బైరపాక ప్రశాంత్, శరత్చంద్ర, అరూరి రంజిత్, రాజ్గోపాల్, రాజేందర్, సుమన్, రామ్మూర్తి, వీరు, నాగరాజు, తిరుపతి, రాజేశ్, విష్ణు, కల్యాణ్ తది తరులు పాల్గొన్నారు.