హనుమకొండ చౌరస్తా : ప్రభుత్వాలు బడ్జెట్ ( Budget ) లో బీసీలకు ( BCs ) తీరని అన్యాయం చేస్తున్నాయని బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ ఫోరం వ్యవస్థాపక ఛైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి.చిరంజీవులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒకరోజు నిరాహారదీక్షను ( Hunger strike ) విజయవంతం చేయాలని ఫోరం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ డాక్టర్ కూరపాటి రమేశ్, ఉమ్మడి వరంగల్ జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ కె.వీరస్వామి కోరారు.
బుధవారం హనుమకొండలోని కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మెజార్టీ ప్రజలైన బీసీలకు జనాభా నిష్పత్తికనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో ఫోరం కోర్ కమిటీ సభ్యులు ప్రొఫెసర్ బెనర్జీ, మండల పరశురాములు, రాజ్మహ్మద్, రవితేజ పాల్గొన్నారు.