హనుమకొండ చౌరస్తా, మార్చి 27 : ఇండస్ట్రీ అకాడమియా ఇన్నోవేషన్ కాన్ క్లేవ్ మూడో ఎడిషన్ శుక్రవారం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లోని అంబేదర్ లెర్నింగ్ సెంటర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి మాట్లాడుతూ.. స్పాన్సర్డ్ రీసెర్చ్ అండ్ ఇండస్ట్రియల్ కన్సల్టెన్సీ విభాగం, సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఇన్యుబేషన్తో కలిసి పరిశ్రమ-అకాడమియా అనుసంధానాన్ని బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
ఇందులో పరిశ్రమ, అకాడమియా, పరిశోధనా సంస్థల ప్రముఖులు పాల్గొని సాంకేతిక పరిజ్ఞాన మార్పిడిని వేగవంతం చేయడం, ఆవిషరణల ఆధారిత అభివృద్ధిని ప్రోత్సహించడం వంటి అంశాలపై చర్చించినట్లు చెప్పారు. సాంకేతిక సెషన్లు, ప్యానెల్ చర్చలు, స్టార్టప్ ప్రదర్శనలు, టెక్నాలజీ స్టాల్స్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ కార్యక్రమంలో ముఖ్య ఆకర్షణగా, సంస్థ కమ్యూనికేషన్, అవుట్ రీచ్ సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఉపయోగపడే అత్యాధునిక ఎల్ఈడీ బోర్డ్ను ప్రారంభించారు. సాంకేతిక విద్యాసంస్థల పాత్ర తరగతి గదులు, ప్రయోగశాలలకు మాత్రమే పరిమితం కాకుండా సమాజం, పరిశ్రమ ఎదురొనే సవాళ్లకు పరిషారాలు అందిస్తుందన్నారు. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ సీఈవో డాక్టర్ శివకుమార్ కల్యాణరామన్ ఆన్లైన్ ద్వారా కీలక ప్రసంగం అందించారు.