హసన్పర్తి, అక్టోబర్ 18: ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుకెళ్లాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఎర్రగట్టుగుట్టలోని కేఎల్ఎన్ ఫంక్షన్హాలో గ్రేటర్ 1, 2, 65 డివిజన్ల సమన్వయ కమిటీ సభ్యులు, బూత్ ఇన్చార్జిలు, పార్టీ ముఖ్య కార్యకర్తలతో ఎమ్మెల్యే బుధవారం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్పార్టీ గెలుపు నల్లేరుపై నడకేనని అన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి గడపకు వెళ్లి వివరించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు. అభివృద్ధి వైపే వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు ఉంటారని, మరోసారి లక్ష మెజారితో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. కార్పొరేటర్ గుగులోత్ దివ్యారాణీ రాజునాయక్, డివిజన్ అధ్యక్షులు నరెడ్ల శ్రీధర్ జంగ కుమార్యాదవ్, ఏరుకొండ శ్రీనివాస్, ప్యాక్స్ చైర్మన్లు మెరుగు రాజేశ్గౌడ్, చల్లా గోపాల్రెడ్డి, నాయకులు చల్లా వెంకటేశ్వర్రెడ్డి, వివిధ గ్రామాల గ్రామశాఖ అధ్యక్షులు దోమల శ్రీనివాస్, నద్దునూరి యువరాజు, కుమార్యాదవ్, చింతం శ్రీనావాస్, సూర ప్రమోద్, నాగరాజు, సాగర్, సమన్వయ కమిటీ సభ్యులు నాయకులు పాల్గొన్నారు.
వర్ధన్నపేట/నయీంనగర్: సీఎం కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకటించిన తర్వాత పెద్ద సంఖ్యలో యువత బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. మండలంలోని అంబేద్కర్నగర్కు చెందిన యువకులు, హనుకొండ మండలం తిమ్మాపూర్కు చెందిన బీజేపీ యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే రమేశ్ పార్టీ కండువాను కప్పి స్వాగతించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పదేళ్లుగా నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ సేవలందిస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా సీఎం కేసీఆర్, మంత్రుల సహకారంతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, విలీన గ్రామాలను ఎంతగానో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. తిమ్మాపూర్కు చెందిన సుమారు 80 మంది బీజేపీకి చెందిన యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రానున్న రోజుల్లో యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేలా ప్రత్యేక కార్యచరణ రూపొందించడం జరుగుతందని అన్నారు. డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం బిక్షపతి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి పాల్గొన్నారు. ఐనవోలు మండలం కొండపర్తికి చెందిన కాంగ్రెస్ నుంచి పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరగా ఎమ్మెల్యే అరూరి వీరికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. సర్పంచ్ రాజమణి బెన్షన్, సుధీర్, సత్తిరెడ్డి, శ్యామ్, అరుణ్ పాల్గొన్నారు. కాగా, దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకుని గ్రేటర్ వరంగల్ 55, 56వ డివిజన్ సత్యసాయి కాలనీ, రేణుక ఎల్లమ్మ కాలనీ, దేవరాజ్, గణేశ్ నగర్ కాలనీలలో ఏర్పాటు చేసిన దుర్గమాత అమ్మవారిని ఎమ్మెల్యే దర్శించుకున్నారు.