వాజేడు, ఫిబ్రవరి 27 : విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన అధ్యాపకులే విద్యార్థినులతో చీపురు పట్టించారు. బుధవారం నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు జరుగనున్న క్రమంలో మంగళవారం కళాశాలకు వచ్చిన విద్యార్థులతో తరగతులను ఊడిపించారు. ఈ దృశ్యం వాజేడు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కనిపించింది. పరీక్ష తేదీల వివరాలు తెలుసుకునేందుకు ‘నమస్తే తెలంగాణ’ అక్కడి వెళ్లిన క్రమంలో ఈ విషయం వెలుగుచూసింది. స్వీపర్లతో శుభ్రం చేయించాల్సి ఉండగా కళాశాలలో చదువుతున్న వారితో పనులు చేయించడం చర్చనీయాంశమైంది. ప్రిన్సిపాల్ను ఫోన్లో వివరణ కోరగా ‘స్వీపర్ లేదు.. ఇది సహజమే.. రాద్ధాంతం చేయొద్దు’ సమర్థించుకున్నారు.
విద్యార్థులతో పనిచేయించొద్దు : జిల్లా ఇంటర్ నోడల్ అధికారి వెంకటేశ్వర్లు స్వీపర్ లేదా ప్రైవేట్ వ్యక్తులతో తరగతులు శుభ్రం చేయించాలి. విద్యార్థినులతో పనులు చేయించొద్దు. ప్రిన్సిపాల్తో మాట్లాడుతానన్న్పారు. కళా శాలలో పనిచేస్తున్న ఒక ఉపన్యాసకుడు సైతం ఫోన్ చేసి తమను ఇబ్బందులకు గురిచేయొద్దని, పేపర్లో రాయొద్దని వేడుకోవడం కొసమెరుపు.