వరంగల్ : రాజకీయలకతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. రూ.15 కోట్లతో నల్లబెల్లి నుంచి దుగ్గొండి మీదుగా గిర్నిబావి వరకు బీటీ రోడ్డు విస్తరణ పనులకు మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవితతో కలిసి శంకుస్థాపన చేశారు.
అనంతరం నూతన పెన్షన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పలు కారణాల వల్ల పెన్షన్ కార్డులు రాని అర్హత ఉన్నవారు మళ్లీ దరఖాస్తు చేసుకుంటే కొత్త కార్డులు ఇప్పిస్తామన్నారు.
సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి నూతన పింఛన్లు మంజూరు చేశారు. ఆసరా పింఛన్లు నిరుపేదలకు ఎంతో భరోసానిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉందన్నారు.
ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.