‘నాడు వచ్చీరాని కరెంటుతోని అరిగోస పడ్డం.. ఇప్పుడు 24గంటల కరెంటు తోటి రంది లేకుంట ఎవుసం చేస్తున్నం.. రాత్రిపూట పొలాలకాడికి పోయే బాధ తప్పింది. కాంగ్రెస్సోళ్లకు ఎవుసం తెలిసి మాట్లాడుతున్నరో.. తెల్వక మాట్లాడుతున్నరో.. మూడు గంటల కరెంటు తోని పొలాలకు నీళ్లెట్ల పారిస్తరో వాళ్లకే తెల్వాలె.. ఇప్పుడు వేలు, లక్షలలున్న మోటర్లను తీసేసి వేలకు వేలు పెట్టి 10హెచ్పీ మోటర్లు కొనాల్నా? ఏన్నుంచి తేవాలె పైసలు? అంత పెద్ద మోటరు పెట్టి నీళ్లు గుంజుతె భూమిల ఊట ఉంటదా? సోయుండే మాట్లాడుతున్నరా వాళ్లు.. ధరణి తీసేస్తరట. ఎందుకు మళ్ల పాత దళారుల వ్యవస్థ తెచ్చి లొల్లులు కొట్లాటలకా?’ అంటూ కర్షక లోకం మండిపడుతున్నది. పాత రోజులను మళ్లీ తాము కోరుకోవడం లేదని, ఇప్పుడు ప్రశాంతంగ బతుకుతున్న తమ జీవితాల్లో నిప్పులు పోయొద్దని తెగేసి చెబుతున్నది.
‘దేశాన్ని దాదాపు 60ఏండ్లు పాలించిన కాంగ్రెస్, రైతుల కష్టాలను ఏనాడైనా తీర్చిందా.. నాడు కరెంటు ఎప్పుడు వస్తదో ఎప్పుడు పోతదో తెల్వని పరిస్థితి. రాత్రిపూట చేన్లకాడికి పోయి పాములు, విష పురుగులు కుట్టి ఎంతమంది సచ్చిపోయిన్రు.. ఉండీలేని కరెంటు తోని పొలాలు తడువక ఎన్నిసార్లు పంటలు ఎండిపోయినయ్.. అవన్ని ఎట్ల మర్శిపోతం..’ అంటున్నరు రైతులు. వ్యవసాయానికి కాంగ్రెస్ మూడు గంటల కరెంటు చాలంటున్నదని, మూడు గంటలతోటి మూడు మడులు కూడా తడువయని, ఎద్దు, ఎవుసం తెల్వనోళ్లు ఇలానే మాట్లాడుతరని ఎద్దేవా చేస్తున్నారు. 10హెచ్పీ మోటర్లకు కరెంటు ఎంతకావాలె.. ఇప్పుడు రైతుల పొలాలన్నిటికీ 10 హెచ్పీ మోటర్లు ఎవరు పెట్టాలె అని ప్రశ్నిస్తున్నారు. అంతపెద్ద మోటరు పెడితే బోరు బావుల్లో ఊట ఉంటదా అని అడుగుతున్నారు. కాంగ్రెస్ వాళ్ల వల్లే తాము చేతుల్లో పైసలు లేక బక్కవడ్డమని, తెలంగాణ ప్రభుత్వం వచ్చాకనే నాలుగు పైసలు కనవడుతున్నయని చెబుతున్నారు. 24గంటల కరెంటుతోని ఇప్పుడు రందిలేకుంట ఎవుసం చేసుకుంటున్నామని, మళ్లీ పాతరోజులు వద్దని తెగేసి చెబుతున్నారు. ధరణిని తీసేసి భూమాతను తెస్తామని కాంగ్రెస్సోళ్లు అంటున్నారని, వాళ్ల తీరు చూస్తుంటే మళ్లీ దళారుల వ్యవస్థను తెచ్చి దండుకోవాలని చూస్తున్నారని అర్థమవుతోందంటున్నారు. ఇప్పుడు ధరణిలో భూముల రిజిస్ట్రేషన్లు నిమిషాల్లోనే పూర్తవుతున్నాయని, చాలా సమస్యలు పరిష్కారమై సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ఇంత మంచి పోర్టల్ను తీసేసి మళ్లా కొట్లాటలు పెట్టే పాత వ్యవస్థను తెస్తామనడం ఏం పద్ధతని ప్రశ్నిస్తున్నారు.
నర్సంపేట రూరల్: గతంలో పట్వారీ వ్యవస్థతో అనేక కష్టాలు పడ్డాం. సీఎం కేసీఆర్ వల్ల ప్రస్తుతం ఆ బాధలు తప్పినయ్. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది. కాంగ్రెస్తో అష్టకష్టాలు పడ్డాం. సంవత్సరాల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగినా భూమి పట్టాలు కాలేదు. తెలంగాణ ప్రభుత్వం ధరణితో పట్టా అందించింది. నాకు ఉన్న ఎకరంలో 20 గుంటలు నాపేరిట పట్టా ఎక్కించుకున్నాను. నా కూతురు పేరిట మరో 20గుంటల భూమి ఎక్కించి పెండ్లి చేశాను. రైతుబంధు పైసలు ఇద్దరికీ పడుతున్నాయి.
కాజీపేట : సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ తీసుకువచ్చి రైతులకు భద్రత కల్పించిండు. మాకు రెండున్నర ఎకరాల భూమి ఉంది. గతంలో పటేల్, పట్వారీ వ్యవస్థ ఉన్నప్పుడు దొంగ రిజిస్ట్రేషన్లు చేసిండ్లు. రెవెన్యూ రికార్డుల్లో గోల్మాల్ చేస్తూ రైతులను మోసం చేసే వారు. గతంలో తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా పనులు కాకపోయేది. ధరణితో రైతులకు పదిహేను నిమిషాల్లో పట్టాదారు పాస్ పుస్తకం వస్తున్నది. నా భూమికి ఒక్క రూపాయి లంచం లేకుండా పాస్ పుస్తకం వచ్చింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడూ రైతుల గురించి పట్టించుకోలేదు. వాళ్ల మాటలు రైతులు నమ్మితే నట్టేట మునగడం ఖాయం.
నర్సంపేట: సీఎం కేసీఆర్ వ్యవసాయానికి ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉచితంగా 24 గంటలు నాణ్యమైన కరెంటు అందిస్తున్నారు. రైతుల మేలు కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నారు. సమైక్య పాలనలో కరెంటు కోసం రైతులం గోసపడ్డాం. ఎన్నోసార్లు ఆందోళనలు చేసిన ఘట నలు ఉన్నాయి. వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇవ్వడం వల్ల పంట ఉత్పత్తులు అధికంగా వచ్చాయి. పంటలు ఎండి పోకుండా కరెంటు మోటర్లతో నీరు పెట్టాం. నాణ్యమైన కరెంటు ఇస్తున్నందున మోటర్లు కాలిపోలే. దీనివల్ల రైతు లపై ఎలాంటి భారం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు మూడు గంటల కరెంటు ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉంది. వారికి అసలు వ్యవసాయం అంటే తెలుసా? రైతులు ఎంత కష్టపడుతున్నారో తెలుసా? రైతులు ఆరుగాలం కష్ట పడి పంటలను పండిస్తున్నరు. 24గంటల కరెంటు ఇచ్చిన బీఆర్ఎస్కే రైతులు మద్దతు ఇస్తరు.
నర్సంపేట: ధరణి పోర్టల్ లేకుంటే రైతులు ఆగం కావాల్సి వస్తుంది. ధరణి రావడానికి ముందు రైతులకు పట్టా పాసుపుస్తకాలు ఉండేవి కావు. తమ భూమిపై హక్కులు కలిగి లేకపోయే వారు. రుణాల కోసం అవస్థలు పడ్డారు. పటేల్, పట్వారీలు రాసిందే పరిగణలోకి తీసుకునేవారు. పటేల్, పట్వారీలు ఒకరి భూములను మరొకరి పేర్ల మీద రాసి పెట్టారు. దీనివల్ల గొడవలకు దారి తీసేది. రైతులు అధికారుల కాడికి తిరగాల్సి వచ్చేది. పహాణీలు తీసుకోవ డానికి ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ధరణి రావడంతో ఈ సమస్యలన్నీ పోయాయి. రైతులకు అన్నిరకాల భూములు ధరణిలో ఎక్కాయి. రైతులకు భూమి హక్కులు పూర్తిగా వచ్చాయి. గతంలో కాగితాలు లేని వాటిని కూడా సీఎం కేసీఆర్ సాదాబైనామాలను కూడా రెగ్యులర్ పట్టాలుగా చేశారు. పూర్వం నుంచి రైతులకు తెల్లకాగితాల మీదే భూమిని రాసుకున్నారు. వాటిని రైతులకు పూర్తి స్థాయిలో పట్టాకాలంలో పేర్లు వచ్చేలా చేసి, పట్టా పాసుపుస్తకాలను అందించింది సీఎం కేసీఆరే. రైతులందరూ ఆయనకు ఎంతో రుణపడి ఉన్నారు. ధరణి పోర్టల్తో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ధరణి తీసేస్తామంటే రైతులకు ఇబ్బందులు తప్పవు. రైతులకు మేలు చేసేలా ధరణిని తెచ్చిన సీఎం కేసీఆర్కు రైతులందరం అండగా ఉంటాం. తెలంగాణ ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా ఆదుకుంది.
హనుమకొండ : తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో రైతులకు మేలే జరుగుతుంది. ఇప్పుడు పైరవీలు లేవు. దళారీ వ్యవస్థ లేదు. గతంలో మాదిరిగా అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. అరగంటలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయి పత్రాలు రైతుల చేతికి అందుతున్నాయి. రైతుల భూములపై ఇంకొకరికి హక్కు ఉండదు. సంబంధిత యజమాని వేలిముద్ర వేస్తేనే భూమి బదలాయింపు జరుగుతుంది. గతంలో మాదిరిగా అవకతవకలకు తావులేదు. ధరణిని రద్దు చేస్తే పాతకాలం పరిస్థితులు రావడంతో పాటు పైరవీకారులు పెరుగుతారు. రైతులకు తెలియకుండానే గోల్మాల్ జరిగే ఆస్కారం ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసివేస్తామని అంటున్నారు. వారి వ్యవహారం చూస్తే రైతుల మధ్య మళ్లీ అగాధం పెంచే ప్రయత్నం చేస్తున్నారని అర్థం అవుతుంది. అలాగే పట్వారీ వ్యవస్థ వస్తే మళ్లీ రైతులకు గోస తప్పదు. పట్టాదారు స్థానంలో అనుభవం దారు, మాన్యందారు పేరు పెడితే అసలు పట్టదారులకు కష్టాలు మొదలవుతాయి. సీఎం కేసీఆర్తోనే మా కష్టాలు తీరినయ్. ఆయన వెంటే ఉంటాం.
సంగెం : 3 గంటల కరెంటు రైతులకు ఎట్లా సరిపోతది. మడులు కూడా సరిగ్గా తడవవు. రైతులను మోసం చేసేందుకే కాంగ్రెస్ నేతలు దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారు. ప్రస్తుతం 24గంటల కరెంటును ప్రభుత్వం ఇస్తున్నది. రైతులు ఇష్టమున్న సమయంలో వెళ్లి పంటలకు నీరు పారిచ్చుకుంటున్నారు. ఎక్కువగా 3హెచ్పీ మోటర్లను వాడుతున్నరు. కాంగ్రెస్ వాళ్లు 3 గంటల కరెంటు సరిపోతుంది అని చెప్పడం సిగ్గుచేటు. 10హెచ్పీ మోటర్లు పెట్టుకోవాలనడం సరి కాదు.10హెచ్పీ మోటర్తో సాల్లు ఉంటయా? అందరూ ఓకేసారి మోటర్లు వేస్తే ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతయి. కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాల్సిందే.
గీసుగొండ : ధరణి పోతే దళారులొచ్చి ఇష్టం వచ్చినట్టు ఒకరి భూమిని మరొకరి పేరు మీదకు మారుస్తరు. కాంగ్రెస్ ప్రభుత్వంలో భూములను రక్షణ ఉండేది కాదు. ధరణి వచ్చినంక మా భూముల వివరాలు ఫోన్లోనే చూసుకుంటానం. మళ్లీ కాంగ్రెస్ వస్తే వీఆర్వోలు, దళారుల రాజ్యం అవుతుంది. భూములు ఆగమాగమవుతయి. కేసీఆర్ వచ్చినంక గ్రామంలో భూ తగదాలు తగ్గినాయి. ఒక్కసారి పచ్చ పాసు బుక్కు వస్తే మళ్లీ రైతు వేలి ముద్ర పడితేనే భూమి మారుతాంది. మా భూములు మా పేర్ల మీద ఎక్కటానికి ఆనాడు పైసలు ఇచ్చినం. ఇప్పుడు ఆ భాధ తప్పింది. మళ్లీ కాంగ్రెస్ వస్తే పాత రోజులు వస్తాయి. మా భూములకు రక్షణ ఇచ్చిన కేసీఆర్ వస్తే రైతుల భూములు ఆగం కావు..
కమలాపూర్: కాంగ్రెస్ పాలనలో మొదటి మడి పారలేదు. కరంటు ఎప్పుడు వస్తదో తెల్వదు.. ఎప్పు డు పోతదో తెల్వకుండేది. నీళ్లు పెట్టేందుకు బాయి కాడికి రాత్రి పూట లైటు పట్టుకుని వెళ్లేది. ఎప్పుడో అర్ధరాత్రి కరంటు వస్తే ఆ రాత్రి మోటారు చాలుచేస్తే మొదటి మడి పారకపోయేది. తెలంగాణ వచ్చినంక కేసీఆర్ దయతోనే 24గంటల కరంటు ఇస్తుండటంతో ఎవుసం తెల్లవడ్డది. ఎప్పుడు మోటారు పెట్టుకోవాలని అనిపిస్తే అప్పుడు బాయికా డికి పోయి కరంటు పెడుతున్నా. కాంగ్రెస్ వస్తే కరంటు ఇచ్చేది తెల్వదు, సచ్చేది తెల్వదు.చేసినోళ్లే లేరు. సీఎం కేసీఆర్ వచ్చినంకనే మా కష్టాలు తీరినయ్. 24 గంటల ఉచిత కరెంట్తో పంటలు మంచి పండించు కుంటున్నం. నాలుగు రూపాలు ఎనుకేసుకుంటున్నం.
హనుమకొండ సిటీ : రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ రైతుల గోసను తీర్చేందుకు 24 గంటల కరెంట్ సరఫరా చేస్తున్నారు. రాత్రిళ్లు పొలం, శెల్కల దగ్గరికి పోయి నీళ్లు పారించే కష్టాలు తప్పినయ్. అర్ధరాత్రి విషసర్పాలకు బలయ్యే పరిస్థితి పోయింది. కొత్తగా కాంగ్రెస్ పార్టీ 3గంటల కరెంటు చాలు అని చెప్తున్నది. దీంతో నీళ్లు సరిపోక రాత్రిళ్లు పొలం కాడికి పొయే పరిస్థితి దాపరించనుంది. అదే జరిగితే కరెంట్ తీగలు తాకి మృత్యువాత పడి కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉన్నది. ప్రస్తుతం 3హెచ్పీ, 5మెచ్పీ మో టర్లతో నీరు పుష్కలంగా వస్తుండగా, 10 హెచ్పీ మోటర్లు దేనికి.. కాల్వల్లో నిత్యం నీరు పారుతున్నది.. ఇప్పుడున్న మోటర్లు సరిపోతాయి.
కమలాపూర్: ధరణి తీసేస్తే దళారులదే రాజ్యం. కాంగ్రెస్ పాలనలో రికార్డుల్లో అనుభవదారు పేరు ఉంటే అప్పటి పట్వా రీలు పట్టాచేసేది. దళారులను పెట్టుకుని వీఆర్వోలు, వీఆర్ఏలు లంచాలు తీసుకు ని ఒకరిపేరుతో ఉన్న పట్టాను మరొకరి పేర రాసి ఇబ్బందులు పెట్టేది. తెలంగాణ వచ్చినంక ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి తీసుకొచ్చి భూములను ఆన్లైన్లో నమోదు చేసి భద్రత కల్పించిండు. పట్టాదారు అనుమతి లేకుండా ఎవరు తొలగించే అధికారం లేకుండా చేసిండు. దీంతో రైతులు సంతోషంగ ఉన్నరు. మళ్లీ పాత రికార్డులను తీసుకువస్తే భూముల కోసం గొడవలు తప్పవు. ధరణి ఉండడం వల్ల ఎవరితో పనిలే కుండా నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు పడుతున్నయి. దాన్ని తీసేస్తే కౌలుకు ఇవ్వడం కష్టంగా ఉంటుంది.
పర్వతగిరి: కాంగ్రెస్ పాలనలో రాత్రి పూట కరెంటుతో రైతుల బతుకు ఆగమైంది. కేసీఆర్ సీఎం అయినంక 24గంటల కరెంటు ఇచ్చి రైతుల కష్టాలను తీర్చిండు. రైతులకు రైతుబంధు అందించడంతో పెట్టుబడికి అప్పులు తేకుండా వ్యవసాయం చేస్తున్నరు. ఆరు నెలలకో ముఖ్యమంత్రిని మార్చే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు రాత్రి పూట మూడు గంటలే కరెంటు ఇస్తారట. తెలంగాణ సీఎం కేసీఆర్కు రైతుల కష్టాలు తెలుసు. ఢిల్లీలో ఉండే కాంగ్రెస్ పెద్దలకు ఏం ఎరుక రైతుల బాధలు. ధరణి తీసేస్తే అనేక కష్టాలు మొదలైతయ్. ధరణి లేనప్పుడు సంవత్సరాల తరబడి తిరిగినా రైతులకు పనులు జరిగేవి కావు. ధరణిని కాపాడాలంటే సీఎం కేసీఆర్ మళ్లీ రావాలి.
పరకాల : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మాయమాటలు చెప్పి రైతుల ను మోసం చేసేందుకు కుట్ర చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు తెలంగాణ గడ్డను చీకటిమయం చేశారు. కరెంటు ఎప్పుడు వచ్చేదో ఎవ్వరికీ తెల్వ కపోతుండే.. కరెంటు కోసం రాత్రింబవళ్లు పొలాల వద్ద కాపు కాచిన రోజులు ఇప్పటికీ మర్చిపోలేం. వాళ్లు గతంలో చేసిందేంటో అందరికీ తెలుసు. మళ్లా ఏదో చేస్తామంటే రైతులె వరూ నమ్మే స్థితిలో లేరు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యవసాయానికి 3 గంటల కరెంటు చాలని, 10 హెచ్పీ మోటర్ పెట్టుకోవాలంటున్నాడు. మూడు గంటల్లో రైతులందరూ 10 హెచ్పీ మోటర్లు ఆన్చేస్తే లోడ్ పెరిగి మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతయన్న సోయి కూడా అతనికి లేదు. వాళ్లకు ఓటేస్తే రైతులు ఆగమైతరు. వ్యవసాయానికి 24గంటల కరెంటే ఉండాలి.
పర్వతగిరి: గతంలో కరెంటు పొద్దుందాక కాకుండా రాత్రిపూట ఇవ్వడంతో గోస పడెటోళ్లం. తెలంగాణా ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ ప్రజల సమస్యలు తెలుసుకుని ఆదుకునేందుకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. 24గంటల కరెంటుతో ఎంతో ప్రయో జనం ఉంది. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుంది. గతంలో రాత్రి పూట కరెంటుతో విద్యుత్ షాక్, ప్రమాదాల పాలై అనేకమంది రైతులు బలయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసే స్తామని చెప్పడం సరికాదు. ధరణితో రైతుల సమస్యలు పో యాయి. అన్నదాత మనసెరిగి పథకాలను అందించిన సీఎం కేసీ ఆర్కు అందరం అండగా ఉంటాం. మళ్ల ముఖ్యమంత్రిని చేసుకుంటం.
నర్సంపేట రూరల్: వ్యవసాయానికి మూడు గంటల కరెంటు సరిపోదు. ఎవుసం తెలియనోడే అట్ల మాట్లాడుతడు. సీఎం కేసీఆర్ ఇ స్తున్న 24గంటల కరెంటు వ్యవసాయానికి ఎలాంటి ఇబ్బందుల్లేవు. కాంగ్రెస్ పాలనలో ఎవుసం చేయాలంటే ఏడ్పు వచ్చేది. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవుసం ఉత్సాహంగా చేస్తున్నాం. సాగు చే యడం సులభమైంది. గతంలో రాత్రి కరెంటుకు ప్రాణాలు పోయేవి.