పరకాల, జూన్ 5 : పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బీ సంతోష్ కుమార్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం కళాశాల ఆవరణలో పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యత కోసం పర్యావరణాన్ని కాపాడాలన్నారు. మొక్కలను నాటడంతో పాటు సంరక్షించాలని, ప్లాస్టిక్ను వినియోగించవద్దన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి కోట్ల మొక్కలను నాటిందన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ తమ వంతుగా పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు ఓదెలు, ఇందిరాదేవి, కుమారస్వామి, రవికుమార్, సుభాషిణి, నవీన్, రాజయ్య, అనిల్ కుమార్, అశోక్ మోరె, సుస్మిత, దుప్పటి సంజయ్, స్వప్న పాల్గొన్నారు.
కాలుష్య నివారణపై అవగాహన అవసరం సీడబ్ల్యూఎస్ రిసోర్స్ పర్సన్ దామోదర్
ఆత్మకూరు : కాలుష్య నివారణపై ప్రజలంతా అవగాహన కలిగి ఉండాలని సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ రిసోర్స్ పర్సన్ డాక్టర్ దామోదర్ అన్నారు. సోమవారం ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దాపురం గ్రామంలో మహిళలతో ర్యాలీ తీశారు. అనంతరం రైతు వేదికలో పర్యావరణంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా దామోదర్ మాట్లాడుతూ కాలుష్య నివారణ కోసం ప్లాస్టిక్ను ఆరికట్టాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కమలా రాజేశ్వర్రావు, సీడబ్ల్యూఎస్ సిబ్బంది కొమ్ముల నవీన్, శ్వేత, ఏఈవో చికిత, కార్యదర్శి రవికుమార్, రైతులు మానస, గ్లోరీ, స్వరూప, మంజుల, రజిత, జమున పాల్గొన్నారు.
హరిత తెలంగాణ నిర్మించాలి
గీసుగొండ : పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి హరిత తెలంగాణను నిర్మించాలని సర్పంచ్ అల్లం బాలిరెడ్డి అన్నారు. మండలంలోని మరియపురం గ్రామంలో సోమవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి అధికారులు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ చిరంజీవి, కార్యదర్శి స్వప్న, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.