గిర్మాజీపేట, ఫిబ్రవరి 27: జిల్లాలో కంటి వెలుగు శిబిరాలకు విశేష స్పందన లభిస్తోంది. రెండో విడుత కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి సోమవారం వరకు 1,81,391 మందికి కంటి పరీక్షలు పూర్తయ్యాయని, అందులో 30,972 మందికి రీడింగ్ కళ్లద్దాలు అందజేశామని, 19,260 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసుల కోసం ఆర్డర్ ఇవ్వగా, సోమవారం వరకు 3,197మందికి అందజేసినట్లు డీఎంహెచ్వో కాజీపేట వెంకటరమణ తెలిపారు. జిల్లాలో 85 జీపీలు, 20వార్డుల్లో కంటి పరీక్షా శిబిరాలు పూర్తయ్యాయని, 25 గ్రామపంచాయతీలు, 19 వార్డుల్లో త్వరలోనే పూర్తవుతాయని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,81,391 మందికి కంటిపరీక్షలు నిర్వహించగా, అందులో 84,914 మంది పురుషులకు, స్త్రీలు, మంది 44 ట్రాన్స్జెండర్లు ఉన్నారని తెలిపారు. 27,795 ఎస్సీలు, 17,789ఎస్టీలు, బీసీలు, 7,898 ఓసీలు, 5,152 మైనార్టీలు, 40 ఏండ్లలోపు ఉన్న 4,083 మందికి, 40ఏళ్లు పైబడిన 26,889 మందికి కంటిపరీక్షలు చేసినట్లు వివరించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల్లో 1,31,159 మందికి ఎలాంటి కంటి సమస్యలు లేవని తెలిపారు.
సద్వినియోగం చేసుకోవాలి
వర్ధన్నపేట/నర్సంపేట రూరల్: మండలంలోని ఇల్లందలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని ఎంపీపీ అన్నమనేని అప్పారావు సోమవారం ప్రారంభించారు. కంటి వెలుగు శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సర్పంచ్ సుంకరి సాంబయ్య, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, ఎంపీటీసీ గొడిశాల శ్రీనివాస్, పిట్టల రమేశ్, జ్యోతి, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్ఖన్నా పాల్గొన్నారు. నర్సంపేట మండలంలోని పర్శనాయక్తండా జీపీలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని ఎంపీపీ మోతె కళావతి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ కంటి వెలుగు ప్రతి ఇంట్లో వెలుగులు నింపుతోందన్నారు. సర్పంచ్ బానోత్ గాంధీ, వైద్యాధికారి బానాల అరుణ్చంద్ర, కంటి వెలుగు క్యాంప్ ఇన్చార్జి డాక్టర్ కవిత ఉన్నారు.
23, 41 డివిజన్లలో..
పోచమ్మమైదాన్/కరీమాబాద్: 23వ డివిజన్లో కొత్తవాడలోని కమ్యూనిటీ హాల్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. డివిజన్ మాజీ కార్పొరేటర్ యెలుగం లీలావతి సత్యనారాయణ సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. దేశాయిపేట మెడికల్ ఆఫీసర్ భరత్కుమార్, ఆకాంక్ష, రమేశ్, అలీ పాల్గొన్నారు. 41వ డివిజన్లో కంటివెలుగు శిబిరాన్ని డివిజన్ కార్పొరేటర్ పోశాల పద్మ సోమవారం పరిశీలించి, పలువురికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. కలకోట్ల రమేశ్, ఈదుల భిక్షపతి పాల్గొన్నారు.