కరీమాబాద్, మే 7 : తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్లను యువత సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ చైర్మన్ అరూరి విశాల్ ఆధ్వర్యంలో మామునూరులోని పీటీసీలో నిర్వహిస్తున్న ఉచిత కోచింగ్ సెంటర్ను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువతకు ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ రంగంలోనూ యువతకు అవకాశాలను కల్పిస్తున్నదన్నారు. వందలాది మంది ఉద్యోగార్థులకు ఉచితంగా కోచింగ్ ఇస్తున్న అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ చైర్మన్ అరూరి విశాల్ను అభినందించారు. అనంతరం విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు.
ఆయా కార్యక్రమాల్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్, ఎమ్మెల్సీ పోంచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కలెక్టర్ గోపి, మేయర్ గుండు సుధారాణి, బెటాలియన్ కమాండెంట్ శివప్రసాద్రెడ్డి, పీటీసీ ప్రిన్సిపాల్ పూజ, కార్పొరేటర్ అరుణ, నాయకుడు కంకణాల సంపత్రెడ్డి పాల్గొన్నారు.