వరంగల్ చౌరస్తా, సెప్టెంబర్ 30 : ప్రభుత్వం నిర్దేషించిన గడువులోగా మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు గోపి, హనుమంతు ఎల్అండ్ టీ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు.
ఆర్అండ్బీ ఆధ్వర్యంలో ఎల్అండ్ టీ సంస్థ రూ.1100 కోట్ల వ్యయంతో 26 అంతస్తుల్లో చేపడుతున్న హాస్పిటల్ నిర్మాణ పనులను శుక్రవారం పరిశీలించారు. వరంగల్ నగరాన్ని హెల్త్ హబ్గా మార్చడానికి కీలకంగా మారనున్న ఈ అతి పెద్ద హాస్పిటల్ అనుకున్న సమయానికి పూర్తి చేయాలన్నారు.
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆదేశాల మేరకు నిర్మాణ పనుల్లో భారీ యంత్రాలను, ఎక్కువమంది కార్మికులతో పనుల వేగాన్ని పెంచాలని, షిఫ్టులవారీగా పనులు కొనసాగించాలని అనుకున్న సమయానికల్లా పనులు పూర్తి చేయాలని అన్నారు.