హనుమకొండ, నవంబర్ 14 : మైనార్టీల సంక్షేమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ ఆలీ అన్నారు. బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కుద్దూస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముస్లింల ఆత్మీయ సమ్మేళనంలో హోంమంత్రితోపాటు, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ ఏళ్లుగా గత పాలకులు ముస్లిం మైనార్టీలను విస్మరించారన్నారు. ఒక కార్పొరేషన్ పదవి కూడా ఇవ్వలేదన్నారు. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం విద్యార్థులకు రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటుచేసి, నాణ్యమైన విద్యతోపాటు భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. ఆడపిల్లల పెళ్లిలకు మేనమామ లాగా షాదీ ముబారక్ ద్వారా రూ.1,00,116 ఇస్తున్నారన్నారు. రంజాన్ పండగను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. గతంలో మైనార్టీల సంక్షేమానికి నిధులు కేటాయించిన దాఖలాలు లేవన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్లో పెద్ద మొత్తంలో కేసీఆర్ నిధులు కేటాయిస్తున్నారన్నారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఓవర్సీస్ పథకం ద్వారా 3300 మంది లబ్ధిపొందారన్నారు. బీజేపీతో బీఆర్ఎస్ అంతర్గత సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలో నిజం లేదని స్పష్టం చేశారు. డిసెంబర్ 3 తర్వాత తెలంగాణలో తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. ఆ తర్వాత రూ.5వేల కోట్లతో ముస్లిం మైనార్టీలకు అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయడానికి సీఎం కేసీఆర్ సంసిద్ధత వ్యక్తం చేశారన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్ డైనమిక్ లీడరని, మైనార్టీలంతా ఐక్యతతో పనిచేసి వినయ్ భాస్కర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
తన రాజకీయ జీవితంలో మైనార్టీల పాత్ర ఎంతో ఉందని వరంగల్ పశ్చిమ అభ్యర్థి, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. మైనార్టీలకు తాను అండగా ఉంటూ వచ్చానని గుర్తు చేశారు. తాను అన్నిమతాలకు గౌరవం ఇస్తానని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీని ఓడించే సత్తా లేక ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు చేస్తున్నారన్నా రు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన చరిత్ర తనదని గుర్తు చేశారు. నియోజకవర్గంలో రాజకీయాలకతీతంగా సేవలు చేశానన్నారు. ఈ సారి ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలు తనను గెలిపించడానికి కట్టుబడి ఉండాలని కోరా రు. బీఆర్ఎస్ ఇంటిని పగులగొట్టి దొంగలు దూరాలని చూస్తున్నారని, వారి మాయ మాటల్లో పడిపోవద్దన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో రూ. 50లక్షలతో ఉసూల్ఖానా నిర్మించినట్లు తెలిపారు. అలాంకర్ వద్ద మరొకటి రూ.40లక్షలతో నిర్మించనున్నట్లు తెలిపారు. కాగా, హోంమంత్రిని, చీఫ్విప్ను మైనార్టీ నాయకులు శాలువాతో సన్మానించి, గజమాలతో ఘనంగా సతరించారు. అలాగే, వివిధ పార్టీలకు చెందిన 300 మంది బీఆర్ఎస్లో చేరగా వారికి మహమూద్ ఆలీ, వినయ్ భాసర్ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఖాదీ బోర్డు చైర్మన్ మౌలానా యూసఫ్ జాహిద్, నియోజకవర్గ కన్వీనర్ జనార్దన్ గౌడ్, మైనార్టీ సెల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నయీముద్దీన్, నాయకులు జహీర్, బ్లూబర్డ్ విద్యాసంస్థల కార్యదర్శి అబ్దుల్ మాజీద్, మౌలానా సయ్యద్, మసూద్ మహ్మద్, ఖాసీంఖాన్, మహ్మద్ అబ్దుల్, అన్వర్, కల్పలత సూపర్ బజార్ వైస్ చైర్మన్ షఫీ, మహ్మద్, అఫ్జల్, సోనీ, బియాబాని, హుస్సేన్, ఖలీల్, మహ్మద్ షరీఫ్, మహ్మద్ అన్వర్, తస్లీమా కౌర్, ఇస్మాయిల్, రజియా, రిజ్వానా, సత్తార్, కరీమున్నీసా బేగం పాల్గొన్నారు.
వరంగల్ పశ్చిమ నియోజక వర్గంలో రోజు రోజుకు కాంగ్రెస్, బీజేపీతో పాటు ఇతర పార్టీలకు రాజీనామా చేసి బీఆర్ఎస్లో పార్టీలో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అందులో భాగంగా బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో 10,11,57 డివిజన్లకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. వీరికి దాస్యం వినయ్ భాస్కర్ కండువా కప్పి ఆహ్వానించారు. 10వ డివిజన్కు చెందిన విశ్వభారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నయీమ్, 50 మంది కార్యకర్తలు చేరగా, 57 డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన 50 కార్యకర్తలు రాజీనామా చేసి కార్పొరేటర్ నల్ల స్వరూపారాణి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకున్నారు. అలాగే, 11వ డివిజన్ కమల్ ఆధ్వర్యంలో మంతెన నవ్య, నరేశ్, నదియా, పెరుమాండ్ల విష్ణువర్ధన్ బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. తమ సంపూర్ణ మద్దతును దాస్యం వినయ్ భాసర్కు ప్రకటించారు. కార్యక్రమంలో కల్పలత సూపర్ బజార్ వైస్ చైర్మన్ షఫీ, ఖుద్దూస్, మాజీ కార్పొరేటర్ మేకల బాపూరావు పాల్గొన్నారు.