హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 13 : చారిత్రక వేయిస్తంభాల ఆలయ కల్యాణ మండపాన్ని వైభవంగా నిర్మిస్తున్నామని ఈ నెల చివరి వారంలో ప్రారంభిస్తామని కేంద్ర పర్యాటక పురావస్తు శాఖ మంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు. మంగళవారం ఆయన ఆలయాన్ని, మండపాన్ని పరిశీలించి స్థపతి శివకుమార్, పురావస్తు శాఖ సూపరింటెండెంట్ స్మిత ఎస్కుమార్, ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ రాధికాగుప్తా, జిల్లా అధికారి మల్లేశంతో కలిసి చర్చించారు. మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాశీ, అయోధ్య రామాలయం, కేథార్నాథ్, బద్రీనాథ్, ఓం కారేశ్వర్, సోమనాథ్ ఆలయం, రామప్ప ఆలయాన్ని యునెస్కోలో చేర్చే అవకాశం కలిగిందన్నారు. రామప్ప ఆలయాన్ని రూ.60 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని, ఖిలా వరంగల్ కోటలో రూ.3 కోట్లతో సౌండ్ అండ్ లైట్స్తో ఆధునీకరిస్తున్నామని చెప్పారు. ట్రైబల్ సర్యూట్ పేరుతో పరిసర ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో గెస్ట్హౌస్లు, బోట్లు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందించామన్నారు.
ములుగులో సమ్మక-సారలమ్మ గిరిజన యూనివర్సిటీ మంజూరు చేశామని, త్వరలోనే ప్రధాని మోదీ ప్రారంభిస్తారని చెప్పా రు. తాతాలికంగా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించి ఈ సంవత్సరం కోర్సులను ప్రారంభిస్తామన్నారు. మేడారం జాతరలో ట్రైబల్ స్టాల్స్ ఏర్పాటు చేశామని, భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అనంతరం రోడ్డును వెడల్పు చేసి పార్కింగ్, టూరిజం గెస్ట్హౌస్ నిర్మించాలని పలు రాజకీయ పార్టీల నాయకులు కిషన్రెడ్డిని కలిసి విన్నవించారు. అంతకుముందు కల్యాణ మంటప విశేషాల ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలించారు. వారి వెంట మార్తినేని ధర్మారావు, రావు పద్మ, మాజీ మేయర్ టి.రాజేశ్వర్రావు, కొండేటి శ్రీధర్, ఘంటా రవికుమార్, విజయ్, చంద్రారెడ్డి, చాడ శ్రీనివాస్రెడ్డి, గండ్రాతి రాజు ఉన్నారు. వైదిక కార్యక్రమాలను ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, మణికంఠశర్మ, సందీప్శర్మ, ప్రణవ్లు నిర్వహించారు.