కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజాకార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 31వ తేదీన నిర్వహించే కార్మిక యుద్ధభేరికి కార్మికులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ పిలుపునిచ్చారు. హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ లేబర్, కాజీపేట రైల్వే జంక్షన్, బాపూజీ చౌరస్తాలో ఆటో అడ్డాలను సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా లేబర్ అడ్డాలో కార్మికులతో కలిసి అల్పాహారం చేసి, వారి సమస్యలపై చర్చించారు. కుమార్పల్లి మార్కెట్ను సందర్శించి కూరగాయలు విక్రయించారు. యుద్ధభేరి సభ కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం చీఫ్ విప్ దాస్యం వినయ్భాసర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎకడాలేని విధంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కార్మిక సంక్షేమ మాసోత్సవాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఆటో కార్మికులకు అండగా ఉంటానని చెప్పారు.
– హనుమకొండ చౌరస్తా/ కాజీపేట, మే 29
హనుమకొండ చౌరస్తా/కాజీపేట, మే 29: ఈనెల 31న హనుమకొండ ఆర్ట్స్ కళాశాల ఆడి టోరియం ఆవరణలో నిర్వహించనున్న కార్మిక యుద్ధభేరి సభకు తరలిరావాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ పిలుపునిచ్చారు. కార్మిక సంక్షేమ మాసోత్సవంలో భాగంగా పబ్లిక్ గార్డెన్ లేబర్, కాజీపేట రైల్వే జంక్షన్, బాపూజీ చౌ రస్తాలో ఆటో అడ్డాలను సందర్శించారు. కార్మికు లతో కలిసి అల్పాహారం చేస్తూ వారి సమస్యలపై చర్చించారు. కుమార్పల్లి మార్కెట్ను సందర్శించి కూరగాయలు విక్రయించారు. ఈ సందర్భంగా యుద్ధభేరి కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంత రం చీఫ్ విప్ దాస్యం వినయ్భాసర్ మాట్లాడు తూ రాష్ట్రంలో ఎకడాలేని విధంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మే నెల మొత్తం కార్మి క సంక్షేమ మాసోత్సవాలు నిర్వహిస్తున్నా మన్నా రు. ఇందులో భాగంగా కార్మికుల ఐక్యత, వారి ఆర్థిక, ఆరోగ్య అభివృద్ధి కోసం కృషి చేస్తూ పలు రకాల వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్రానికి దిక్సూచిగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఉందని తెలిపారు. నగ రంలోని ఆటో డ్రైవర్ల కోసం ఆటో భవన్ నిర్మిం చేందుకు, అర్హులైన వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆటో కార్మికులకు అన్ని వేళల్లో అండగా ఉంటాన న్నారు.
యుద్ధభేరి సభకు ఆటో డ్రైవర్లలందరూ ఆటో యూనిఫాం ధరించి రావాలన్నారు. కార్మి కుల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తు న్నదని తెలిపారు. ప్రతి కార్మికుడికి లేబర్ కార్డుపై అవగాహన కల్పించి ఇప్పించాలన్నారు. ముఖ్య మంత్రి కేసీఆర్ కార్మికుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలను సద్వినియోగం చేసుకునేలా చొరవ చూపాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అవ లంబిస్తున్న ప్రజాకార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 31వ తేదీన కార్మిక యుద్ధభేరిని నిర్వహించనున్నట్లు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హరీశ్రావు హాజరవుతున్నట్లు తెలిపారు. విజయవంతం చేయాలని కోరారు.
కార్యక్రమంలో 47వ డివిజన్ కార్పొరేటర్ సంకు నర్సింగరావు, 5వ డివిజన్ అధ్యక్షుడు బొళ్లపెల్లి చందర్, ప్రతాప రుద్ర ఆటో యూనియన్ అధ్యక్షు డు గడ్డం నరహరి, ప్రధాన కార్యదర్శి నాతి సత్య నారాయణ, కోశాధికారి భూక్యా శంకర్నాయక్, ట్రైసిటీ ఆటో అడ్డా యూనియన్ గౌరవాధ్యక్షుడు మైసారపు సిరిల్ లారెన్స్, అధ్యక్షుడు ముచ్చు భిక్ష పతి, ప్రధాన కార్యదర్శి కృష్ణం రాజు, కోశాధికారి జేరిపోతుల వెంకన్న, బొక్కస్వామి, ఎండీ నజీ ర్, పాలడుగుల రవి, సుధాకర్, నర్మెట మధుకర్, గోవర్దన్, వెంకటేశ్, రాజ్కుమార్, వెంకన్న, రాజే శ్, సారయ్య, బండి రాంచందర్, పైడయ్య, బస్కే నరేశ్, శ్రీనివాస్, నార్లగిరి రవి, బీఆర్ఎస్ నాయ కులు నలుబోలు సతీశ్, సుంచు కృష్ణ, కాటాపురం రాజు, మర్యాల కృష్ణ, శంకర్, బరిగెల వినయ్, శ్రీ నివాస్, బొట్టు రాజు, శేఖర్ పాల్గొన్నారు