పోచమ్మమైదాన్, జనవరి 9 : ప్రముఖ పారిశ్రామికవేత్త, వరల్డ్ పద్మశాలీ క్లబ్ వ్యవస్థాపకుడు, రాష్ట్ర పద్మశాలీ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రామా శ్రీనివాస్ (59) మంగళవారం ఆకస్మికంగా మృతిచెందారు. వరంగల్లోని రామన్నపేటకు చెందిన ఆయన హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో గుండెపోటుతో కన్నుమూశా రు. ఆయన హఠాన్మరణాన్ని కుటుంబ సభ్యులు, ఫౌండేషన్ సభ్యులు, నగరవాసులు, పద్మశాలి కులస్తులు తట్టుకోలేకపోతున్నారు. శ్రీనివాస్ భౌతికకాయాన్ని మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, లక్ష్మారెడ్డి, జెన్కో మాజీ సీఎండీ ప్రభాకర్రావు సందర్శించి నివాళులర్పించి కుటుంబసభ్యులను ఓదార్చారు. వరంగల్ నుంచి చాలామంది కడసారి చూసేందుకు తరలివెళ్లారు.
పారిశ్రామికవేత్తగా ఎదిగిన శ్రీనివాస్, అనేక సేవా కార్యకమాలు చేశారు. తల్లిదండ్రులు ఆగయ్య-ఉప్పలక్ష్మి కోరిక మేరకు రామన్నపేటలో మోక్షారామం ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. తద్వారా పేదలు, వృద్ధులు, అనాథల కు సేవలందించారు. రామన్నపేటలో రూ.50లక్షలతో శ్మశానవాటికను అభివృద్ధి చేశారు. అనాథ మృతదేహాల కు ఆయనే అంత్యక్రియలు చేయించేవారు. మోక్షారా మం ఫౌండేషన్ ద్వారా రామన్నపేటలో సొంత భవనం నిర్మించి, నిత్యం వృద్ధులు, అనాథలకు అన్నదానం చేస్తున్నారు. ఇప్పటివరకు 250 మందికి మంగళసూత్రా లు, బట్టలు, నగదు సహా యం చేసి పెళ్లి పెద్దగా నిలిచారు. కాశీలో పద్మశాలి సత్రానికి రూ.కోటి, తిరుపతిలో పద్మశాలి సత్రానికి రూ. కోటి, శ్రీశైలంలో అన్నదానం కోసం రూ. 10 లక్షలు, వేములవాడలో నిత్యాన్నదానం కోసం రూ. 8 లక్షలు, గెస్ట్హౌస్ కోసం రూ.53లక్షలు, బాసర ఆలయానికి రూ.30లక్షలు, అయోధ్యలో స్థలం కోసం రూ. కోటి, సత్రాల కోసం రూ.50లక్షలు, యాదగిరిగుట్ట కు రూ.30 లక్షలు, రామజన్మభూమి కోసం రూ. 25 లక్షలు విరాళం ఇచ్చారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ నిర్వహణ కోసం రూ.2 కోట్ల విలువైన 420 రిక్షాలు, లక్ష డస్ట్బిన్లు అందించారు. హంటర్ రో డ్డులో రూ.50 కోట్లతో వరల్డ్ పద్మశాలి భవనానికి శ్రీకా రం చుట్టారు. రూ.40 కోట్లు సొంతంగా రూ.10 కోట్లను పద్మశాలీల నుంచి వాటాధనంగా సమకూర్చా రు. తెలంగాణ రాష్ట్ర పద్మశాలీ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు.
శ్రీనివాస్ అంత్యక్రియలు బుధవారం నిర్వహించనున్నారు. మంగళవారం రాత్రి నాయుడు పెట్రోల్పంప్ సమీపంలోని ప్రైవేట్ స్కూల్ వద్దకు భౌతికకాయాన్ని తరలించారు. ఉదయం 10గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచి, అనంతరం రామన్నపేటలోని శ్మశానవా టిక వరకు అంతిమయాత్ర నిర్వహించనున్నారు. మోక్షారామం ఫౌండేషన్ ద్వారా అభివృద్ధి చేసిన శ్మశానవాటికలోనే అంత్యక్రియలు జరుగనున్నాయి.