ఏ ఆదెరువు లేని పేదలకు సీఎం కేసీఆర్ పెద్దదిక్కుగా మారారు. వారి బతుకుల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ఆసరా పింఛన్లు ఇచ్చి భరోసా నింపుతున్నారు. ప్రతి నెలా వారి బ్యాంకు అకౌంట్లలో డబ్బులు వేస్తున్నారు. రూ.200, రూ.300 కాదు.. దివ్యాంగులకు రూ.4వేలు, ఇతరులకు రూ.2వేలు ఇస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొత్తం 58,062 మంది లబ్ధిదారులు ఉండగా వీరికి ప్రతి నెలా రూ.13.77 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తున్నది. ఇందులో దివ్యాంగులు 6,861 మంది ఉన్నారు. మళ్లీ ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఆసరా పింఛన్లు పెంచనున్నట్లు మ్యానిఫెస్టోలో పొందుపర్చింది. దివ్యాంగులకు రూ.6వేలు, ఇతరులకు రూ.5వేలు అందనున్నాయి. దీంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మేమంతా బీఆర్ఎస్ వెంటే ఉంటామని స్పష్టం చేస్తున్నారు.
మాకు పింఛన్ ఇంతగా ఎవలు ఇయ్యలె. కాంగ్రెసోళ్లు రూ.200 ఇచ్చేటోళ్లు. అవి మాకు ఎటూ సరిపోయేది కాదు. కొన్నేళ్లు గడిచినా పింఛన్ పెంచలేదు. కేసీఆర్ అచ్చినంక మాకు పెద్ద కొడుకులా దిక్కు అయిండు. ఇప్పుడు రూ.2వేల పింఛన్ ఇస్తున్నడు. మా అవసరాలు తీరుతున్నయ్. మళ్ల గెలిస్తే రూ.5వేలు ఇస్తడట. కేసీఆర్ సారు చెప్పాడంటే ఇత్తడు. ఆయననే గెలిపించుకుంటం. సారు మాటిత్తె తప్పడు రూ.5వేల ఇచ్చి తీరుతడు.
జయశంకర్ భూపాలపల్లి, నవంబర్ 5(నమస్తే తెలంగాణ) : దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని పింఛన్లను సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తూ అండగా నిలుస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, బోదకాల బాధితులు, డయాలసిస్ బాధితులు, బీడీ కార్మికులకు ప్రతి నెలా డబ్బులు వారి అకౌంట్లలో జమ అవుతున్నాయి. రూ.200, రూ.300 కాదు.. దివ్యాంగులకు రూ.4వేలు, ఇతరులకు రూ.2వేల పింఛన్ ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. ఇంత పెద్ద ఎత్తున ఏ రాష్ట్రంలోనూ జరగడం లేదు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొత్తం 58,062 మంది లబ్ధిదారులు ఉండగా ప్రతి నెలా రూ.13.77 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తున్నది. ఇందులో దివ్యాంగులు 6,861 మంది ఉన్నారు. మళ్లీ ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఆసరా పింఛన్లు మరింత పెరగనున్నాయి. దివ్యాంగులకు రూ.6వేలు, ఇతరులకు రూ.5వేల పింఛన్ అందనుంది. దీంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మీమంతా బీఆర్ఎస్ వెంటే ఉంటామని స్పష్టం చేస్తున్నారు. ప్రతిపక్షాల నాయకులు వారు గెలిస్తే రూ.5వేలు, రూ.6వేలు ఇస్తామని చెప్పే మాటలను లబ్ధిదారులు నమ్మడం లేదు. వారి పాలిత రాష్ర్టాల్లో కనీసం వారిచ్చే పింఛన్ రూ.1500 దాటడం లేదు. వారు తెలంగాణలో అధికారంలోకి వస్తే వేలకు వేలు ఇస్తామంటే మేమెలా నమ్ముతామని ప్రశ్నిస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 11 మండలాల్లో 58,062 మంది ఆసరా పెన్షన్లు తీసుకునే లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా ప్రభుత్వం రూ.13.77 కోట్లు చెల్లిస్తున్నది. 11 మండలాల్లో వృద్ధులు 25,054 మంది, వితంతువులు 22,226 మంది, దివ్యాంగులు 6,861మంది, గీత కార్మికులు 1,684మంది, చేనేత కార్మికులు 900 మంది, బోధ కాలు బాధితులు 38 మంది, డయాలసిస్ బాధితులు 20 మంది ,బీడీ కార్మికులు 46 మంది, ఒంటరి మహిళలు 1,233 మంది ఉన్నారు. వీరందరికి సీఎం కేసీఆర్ ఏ రాష్ట్రంలో అందించని విధంగా పింఛన్లు గిఫ్ట్గా ఇస్తున్నారు. వృద్ధులకు రూ.5.35 కోట్లు, వితంతువులకు రూ.4.78 కోట్లు, దివ్యాంగులకు రూ.2.79 కోట్లు, గీత కార్మికులకు రూ.35.58లక్షలు, చేనేత కార్మికులకు రూ.19.31లక్షలు, బోదకాలు బాధితులకు రూ.76,608, డయాలసిస్ బాధితులకు రూ.40,320, బీడీ కార్మికులకు రూ.1.68 లక్షలు, ఒంటరి మహిళలకు రూ.27.13 లక్షలు ప్రభుత్వం ప్రతి నెలా చెల్లిస్తుంది.
బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే ఆసరా పింఛన్లు మరింత పెరగనున్నాయి. ఈ మేరకు సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టో సిద్ధం చేసి ప్రజల ముందు ఉంచారు. దివ్యాంగులకు రూ.6వేలు, ఇతరులకు రూ.5వేల పెన్షన్ను అందించనున్నారు. ఇప్పటికే ఏ రాష్ట్రంలో లేని విధంగా పెన్షన్లను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు. దీంతో లబ్ధిదారులు ఎన్నికల మ్యానిఫెస్టోపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ పింఛన్లు అందించారని, ఏ నెలా పంపిణీ ఆపలేదని, కొత్తగా పెరిగే పింఛన్లు సైతం సక్రమంగానే అందిస్తారని ధీమాతో ఉన్నారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్నే గెలిపించుకుంటామని స్పష్టం చేస్తున్నారు.