కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు
ఐనవోలు, జూన్ 17: తెలంగాణ క్రీడా ప్రాంగణాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అధికారులను అదేశించారు. పల్లె ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం పున్నేలు, ఐనవోలు, వనమాలకనపర్తి, కొండపర్తి గ్రామాల్లోని తెలంగాణ క్రీడా ప్రాంగణాలను పరిశీలించారు. అదే విధంగా పున్నేలు గ్రామంలో నర్సీరీని కూడా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల పనులను త్వరగా పూర్తి చేయాలని, గ్రామాల్లో చెత్తా సేకరణ కార్యక్రమం నిరంతరం కొనసాగాలని ఆదేశించారు. ఆయన వెంట డీఆర్డీవో శ్రీనివాస్కుమార్, తహసీల్దార్ రాజేశ్, ఎంపీడీవో వెంకటరమణ, ఎంపీవో రఘుపతిరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు కత్తి దేవేందర్, కట్కూరి రాజమణి, సునీత, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.