గూడూరు, ఆగస్టు 5 : సీఎం కేసీఆర్తోనే పేదల సొంతింటి కల సాకారమవుతున్నదని ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని తీగలవేణి గ్రామంలో 25 డబుల్బెడ్రూం ఇండ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సొంతిళ్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుందన్నారు. నిరుపేదలు ఇండ్లు కట్టుకోవాలంటే వారి జీవితకాలం సరిపోదని, అలాంటి వారికి నీడనిచ్చేందుకే సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఇది రాష్ట్రంలోని పేదోళ్లు చేసుకున్న అదృష్టమన్నారు. కులమతాలు, పార్టీలకతీతంగా ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శైలజామోహన్రెడ్డి, జిల్లా కో ఆప్షన్ సభ్యుడు ఖాసీం, మండల అధ్యక్షుడు వేం వెంకటకృష్ణారెడ్డి, ఎంపీటీసీ వాసుదేవరెడ్డి, నాయకులు వేణుగోపాల్రెడ్డి, ముక్కా లక్ష్మణ్రావు, సంపత్రావు, సురేందర్, కఠార్సింగ్, తదితరులు పాల్గొన్నారు.
గడ్డిమందు అమ్మితే కఠిన చర్యలు
నెల్లికుదురు, ఆగస్టు 5: ప్రాణాంతకమైన ైగ్లెఫోసెట్ గడ్డిమందును ఎరువులు, ఫర్టిలైజర్స్ షాపుల్లో అమ్మొద్దని, నిబంధనలు అతిక్రమిస్తే షాపును సీజ్ చేయడంతోపాటు యజమానిపై క్రిమినల్ కేసులు పెడుతామని ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలో మాట్లాడుతూ.. ైగ్లెఫోసెట్ గడ్డిమందును రాష్ట్రంలో నిషేధించినప్పటికీ కొందరు బ్లాక్లో విక్రయిస్తున్నారని, క్షణికావేశంలో కొందరు ఆ మందు తాగి మృత్యువాత పడుతున్నట్లు తెలిపారు. నిషేధిత గడ్డిమందు అమ్మిన షాపు లైసెన్స్ను శాశ్వతంగా రద్దుచేయడంతోపాటు యజమానిపై క్రిమినల్ కేసులు నమోదు వెనుకాడేదని లేదన్నారు. బ్లాక్ నిషేధిత గడ్డిమందు అమ్ముతున్న వారిని వ్యవసాయ అధికారులు గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గత వారంలో క్షణికావేశంలో ఆ గడ్డిమందు తాగి మృతిచెందిన వారు ఎక్కువమంది ఉన్నారన్నారు.